దీపావళి 2025: ఈ ఏడాది దీపావళి పండుగను అక్టోబర్ 20న జరుపుకోనున్నారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసం కృష్ణపక్ష అమావాస్య రోజున దీపావళిని జరుపుకునే సంప్రదాయం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 2.32 గంటలకు అమావాస్య తిథి ప్రారంభమై అక్టోబర్ 21 సాయంత్రం 4.26 గంటల వరకు ఉంటుంది.
అక్టోబర్ 20న మధ్యాహ్నం 2:19 గంటల నుండి, అన్ని రాశిచక్రాల ప్రజలు గ్రహాల అనుకూలత, ఆనందం మరియు శ్రేయస్సు కోసం గణేశుడును, లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాగే ధన త్రయోదశి ఎప్పుడు వచ్చింది? ధన త్రయోదశి షాపింగ్ కి సరైన సమయంతో పాటు పూర్తి వివరాలను తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆశ్వయుజ మాసంలో కృష్ణ పక్ష త్రయోదశి తేదీ అక్టోబర్ 18న మధ్యాహ్నం 1:20 గంటల నుండి ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 19న మధ్యాహ్నం 01:54 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో, 18న ధన త్రయోదశిని జరుపుకోవాలి.
నరక చతుర్దశి లేదా చోటీ దీపావళి 2025 ఎప్పుడనే విషయానికి వస్తే.. అక్టోబర్ 18 శనివారం మధ్యాహ్నం నుంచి ధంతేరాస్ షాపింగ్ చేయడానికి మంచి సమయం. అక్టోబర్ 18న ధన్వంతరి జయంతి జరుపుకోనున్నారు. అక్టోబర్ 20న దీపావళి పూజ, అక్టోబర్ 22న మహిళలు గోదానం చేసి పూజలు చేస్తారు.
ఈ సంవత్సరం ధను త్రయోదశి రోజున షాపింగ్ చేయడానికి శుభ సమయం అక్టోబర్ 18 మధ్యాహ్నం 1:20 నుండి అక్టోబర్ 19 మధ్యాహ్నం 01:54 వరకు ఉంటుంది.
దీపావళి పూజకు శుభ సమయం- రాత్రి 7:10 నుండి రాత్రి 9:10 వరకు, మధ్యాహ్నం 1:38 నుండి 3:52 వరకు
ధన త్రయోదశి నాడు ధన్వంతరి, లక్ష్మీ, కుబేరులను పూజిస్తారు. ఈ రోజున, బంగారం మరియు వెండితో సహా గృహోపకరణాలను కొనుగోలు చేయడం శుభప్రదమైనది. ఈ రోజున భూమి, భవనం, వాహనం, ఇతర వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంటికి సంతోషం మరియు సంవృద్ధి లభిస్తుందని నమ్మకం. మట్టి దీపాలు, శ్రీ యంత్రం, బంగారు మరియు వెండి ఆభరణాలు, పాత్రలు, చీపుర్లు, ఉప్పు మొదలైనవి కొనడం శుభప్రదమైనదిగా భావిస్తారు.
ధన త్రయోదశి నాడు లక్ష్మీదేవికి ఇష్టమైన గోమతి చక్రాలను కొనుగోలు చేస్తే కూడా కలిసి వస్తుంది. గోమతి చక్రాలను పూజ గదిలో పెడితే ఆర్థిక ఇబ్బందులు తొలగి పోతాయి. డబ్బు కూడా ఉండదు.