వేదముల చివరి భాగములే ఉపనిషత్తులు అని, ఇవి జ్ఞాన ప్రధానములైనవి అని అందుకే వీటిని వేదాంతము అని అంటారని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలియజేశారు.
‘ఉప’ అనగా సమీపము, ‘ని’ అనగా కింద ‘షత్’ అనగా కూర్చొనుట అని సామాన్యార్థము ఉందని అంటే గురువు సమీపంలో క్రింద కూర్చుని శిష్యుడు జ్ఞానాన్ని ఆర్జించుట అని భావమని ఆయన అన్నారు. విశ్వాంతరాళంలో మనిషికి గల స్థానాన్ని ఇందులో వివరించారన్నారు. ఆత్మ`అంతరాత్మ ఈ ప్రపంచానికి మూలమని, ప్రకృతి రహస్యాల గురించి ఇందులో వివరించడం జరిగిందని ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.
హైందవ జీవనానికి వేదములు ప్రమాణికములని, వేదముల చివరిభాగములను సంహితలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులని నాలుగు విభాగాలుగా వర్గీకరించారని ఆయన తెలిపారు. ఉపనిషత్తులులోే బ్రహ్మవిద్య జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము పరబ్రహ్మస్వరూపము గురించి వివరించారన్నారు.
ఉపనిషత్తులు ఎన్ని అనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. నాలుగు వేదాలకు కలిపి మొత్తం 1,180 ఉపనిషత్తులు ఉన్నాయని, వాటిలో 108 ఉపనిషత్తులు ప్రధానమైనవని, అందులోనూ 10 మరింత ముఖ్యమైనవి.
అనే శ్లోకం ఈ దశోపనిషత్తులను తెలియజేస్తోందని బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు అని ఈ శ్లోకాన్ని ఆయన విశదీకరించారు.
ఈ పది ఉపనిషత్తులకే శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం రచించారు. 108 ఉపనిషత్తులలో శైవ వైష్ణవ వర్గాలవారు తమవిగా కొన్నింటిని భావించారు. శైవులు 15 ఉపనిషత్తులను తమవిగా భావించారని, అవి.. 1. అక్షమాలికోపనిషత్తు, 2. అథర్వ శిరోపనిషత్తు, 3. అథర్వ శిఖోపనిషత్తు, 4. కాలాగ్ని రుద్రోపనిషత్తు, 5. కైవల్యోపనిషత్తు, 6. గణపతి ఉపనిషత్తు, 7. జాబాలోపనిషత్తు, 8. దక్షిణామూర్తి ఉపనిషత్తు, 9. పంచబ్రహ్మోపనిషత్తు, 10. బృహజ్జాబాలోపనిషత్తు 11. భస్మజా బాలోపనిషత్తు, 12. రుద్రహృదయోపనిషత్తు, 13. రుద్రాక్ష జాబాలోపనిషత్తు, 14. శరభోప నిషత్తు, 15. శ్వేతాశ్వతరో పనిషత్తు అని ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.
అలాగే వైష్ణవులు 14 ఉపనిషత్తులు తమవిగా చెప్పుకున్నారు. అవి.. : 1. అవ్యక్తోప నిషత్తు, 2. కలిసంతరణోపనిషత్తు, 3. కృష్ణోపనిషత్తు, 4. గారుడోపనిషత్తు, 5. గోపాలతాప సోపనిషత్తు, 6. తారసోపనిషత్తు, 7. త్రిపాద్విభూతి ఉపనిషత్తు, 8. దత్తాత్రేయోపనిషత్తు, 9. నారాయణోపనిషత్తు, 10. నృసింహ తాపసీయోపనిషత్తు, 11. రామతాపస ఉపనిషత్తు, 12. రామరహస్యో పనిషత్తు, 13. వాసుదేవ ఉపనిషత్తు, 14. హయగ్రీవ ఉపనిషత్తు.
ఇలాగే సన్యాసానికి సంబంధించిన లక్షణాలు, విధివిధానాలను తెలియజేసే ఉపనిషత్తులు 17 ఉన్నాయని, వాటిని సన్యోపనిషత్తులని అంటారని బ్రహ్మశ్రీ ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.
ఉపనిషత్తులు వాటిని రచించిన వారి పేరు మీదుగానే ఎక్కువగా వ్యాప్తిలో ఉన్నాయన్నారు. ఉపనిషత్తులను రచించినవారిలో గార్గి, మైత్రేయి వంటి మహిళామణులు కూడా ఉన్నారని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తిశర్మ తెలిపారు.
టాపిక్