ఈ ఏడాది వట సావిత్రి వ్రతం ఎప్పుడు వచ్చింది? తేదీ, పూజా విధానంతో పాటు మర్రి చెట్టు పూజ ప్రాముఖ్యత కూడా తెలుసుకోండి-vata savitri vratam date timings puja vidhanam and also check importance of banyan tree puja ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ ఏడాది వట సావిత్రి వ్రతం ఎప్పుడు వచ్చింది? తేదీ, పూజా విధానంతో పాటు మర్రి చెట్టు పూజ ప్రాముఖ్యత కూడా తెలుసుకోండి

ఈ ఏడాది వట సావిత్రి వ్రతం ఎప్పుడు వచ్చింది? తేదీ, పూజా విధానంతో పాటు మర్రి చెట్టు పూజ ప్రాముఖ్యత కూడా తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu

వట సావిత్రి వ్రతం హిందూ మతంలో ఒక ప్రధాన పండుగ. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షును కాంక్షిస్తూ వట సావిత్రి వ్రతం ఆచరిస్తారు. వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య రోజున వట సావిత్రి వ్రతం ఆచరిస్తారు. తేదీ, శుభ సమయం, పూజా విధానంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోండి.

వట సావిత్రి వ్రతం (pinterest)

వట సావిత్రి వ్రతం హిందూ మతంలో ఒక ప్రధాన పండుగ. స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుష్షును కాంక్షిస్తూ వట సావిత్రిని ఆచరిస్తారు. వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య రోజున వట సావిత్రి వ్రతం ఆచరిస్తారు. మొదట వట సావిత్రి ఉపవాస దీక్షను అశ్వపతి రాజు కుమార్తె సావిత్రి తన భర్త సత్యవాన్ కోసం చేసింది. అప్పటి నుండి స్త్రీలు తమ భర్తల శ్రేయస్సు కోసం వట సావిత్రి ఉపవాసాన్ని ఆచరిస్తారు.

ఈ ఏడాది వైశాఖ మాసం అమావాస్య నాడు అంటే మే 26 సోమవారం నాడు ఉత్సవాలు చేస్తారు. అమావాస్య తిథి మే 26 మధ్యాహ్నం 12.12 గంటలకు ప్రారంభమై మే 27 ఉదయం 8.32 గంటలకు ముగుస్తుంది. అమావాస్య నాడు మధ్యాహ్నం ఉపవాసం చేయాలి. అందుకే మే 26న ఈ ఉపవాస దీక్ష చేపట్టనున్నారు.

పూజా విధానం

  1. పూజ రోజున ముందుగా బుట్టలో ఇసుక నింపి బ్రహ్మ విగ్రహాన్ని పెట్టి, ఎడమవైపు సావిత్రి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి.
  2. రెండవ బుట్టలో సత్యవాన్ సావిత్రి విగ్రహాన్ని ఉంచండి.
  3. రెండు బుట్టలను మర్రిచెట్టు కింద ఉంచండి.
  4. ముందుగా బ్రహ్మ సావిత్రిని పూజించి ఆ తర్వాత సత్యవాన్, సావిత్రిని పూజించాలి.
  5. ఆ తర్వాత మర్రి చెట్టుకు నీళ్లు పోయాలి.
  6. నీరు పోసిన తరువాత చెట్టు చుట్టూ దారాన్ని చుట్టి మూడు సార్లు ప్రదక్షిణ చేయాలి.
  7. పూలు, పచ్చి పత్తి, శనగలు, బెల్లం, ధూపదీపంతో పూజించాలి.

మర్రి చెట్టు పూజ

పురాణాల ప్రకారం మర్రిచెట్టు తొండంలో విష్ణువు, మూలాల్లో బ్రహ్మ, కొమ్మల్లో శివుడు నివసిస్తారు. కాబట్టి, ఈ చెట్టును పూజించడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుందని, కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అలాగే ఈ చెట్టును పూజించడం వల్ల సంతానం కలుగుతుందని భావిస్తారు.

సావిత్రి దేవి వైశాఖ మాసం అమావాస్య రోజున మర్రిచెట్టు నీడలో తన భర్తను పునరుజ్జీవింపజేసిందని ప్రతీతి. అందుకే ఈ రోజు నుంచి మర్రి చెట్టుకు పూజలు చేయడం ప్రారంభించారు. హిందూ మతంలో రావి చెట్టును విష్ణువుకు చిహ్నంగా భావిస్తారు. అదేవిధంగా మర్రిచెట్టును శివుని చిహ్నంగా భావిస్తారు.

శనీశ్వరుడికి పూజలు

శని దేవుడు వైశాఖ మాసంలోని అమావాస్య నాడు పుట్టాడు. అందుకని ఈ రోజున శని జయంతి చేసుకుంటారు. ఈ నేపథ్యంలో శని భగవానుని ఆశీస్సులు పొందడానికి కొన్ని ప్రత్యేక పరిహారాలని పాటించాలని.

శని దోషం నుంచి ఉపశమనం లభించుటమే కాకుండా శని దేవుని ఆశీర్వాదం కూడా ఉంటుంది. శని అమావాస్య తరవాత 11 రోజులకు దశరధుని శని స్తోత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వలన ఎటువంటి పనుల్లో ఆటంకాలు ఉండవు.

సావిత్రి వ్రతం నాడు ఈ తప్పులు చేయకండి

  • సావిత్రి వ్రతం నాడు నలుపు, తెలుపు లేదా నీలం రంగు బట్టలు ధరించకండి.
  • నలుపు, తెలుపు, నీలం రంగు గాజులు కూడా వేసుకోకూడదు. ఎందుకంటే ఇవి ప్రతికూలతను తీసుకొస్తాయి.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం