ప్రతీ సంవత్సరం ఏప్రిల్ నెలలో అంటే చైత్ర మాసంలో వరూథిని ఏకాదశిని జరుపుకుంటాము. ఈసారి ఏప్రిల్ 24న వరూథిని ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణుమూర్తిని పూజించడం, ఉపవాసం చేయడం వలన అనేక లాభాలు ఉంటాయి.
మహారాజు యుధిష్ఠిరుడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు, 'ఓ భగవంతుడా, పుణ్యం కలిగే వ్రతం గురించి చెప్పండి' అని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు "ఓ రాజేశ్వరా, చైత్ర మాసంలో వచ్చే వరూధిని ఏకాదశి వ్రతం సౌభాగ్యాన్ని ఇచ్చేది, అన్ని పాపాలను నశింపజేసేది. ఈ ఏకాదశి నాడు వ్రతం చేస్తే 10,000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. సూర్యగ్రహణం సమయంలో బంగారం దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఈ వ్రతం చేస్తే అంత ఫలితం వస్తుంది.
ఏనుగుల దానం, గుర్రాల దానం, అన్న దానం కంటే ఏ విరాళమూ గొప్పది కాదని, అన్నదానంతో సమానమైన దానం ఏదీ లేదని చెబుతారు. ఈరోజు అన్నదానం చేయడం ద్వారా దేవతలు, పూర్వీకులు, మానవులు తృప్తి చెందుతారు. ఈ ఏకాదశి రోజున కన్యా దానం, అన్నదానం రెండింటికీ సమాన ఫలితాలు లభిస్తాయి. అత్యాశ ప్రభావంతో ఆడపిల్ల సంపదను చేజిక్కించుకున్న వారు మరుజన్మలో పిల్లిగా పుడతారు.
పూర్వం నర్మదా నది ఒడ్డున మాంధాత అనే రాజు ఉండేవాడు. రాజు ధర్మాన్ని పాటించడంతో పాటు జపతపాలు చేస్తూ ఉండేవాడు. ప్రజల పట్ల దయతో ఉండేవాడు. ఒకసారి ఆయన తపస్సు చేస్తుండగా ఒక ఎలుగుబంటి ఆయన కాలు కొరికి అడవిలోకి లాక్కెళ్లింది. అప్పుడు రాజు విష్ణువును ప్రార్థించాడు. భక్తుడి పిలుపు విని విష్ణువు తన చక్రంతో ఎలుగుబంటిని చంపాడు. కానీ రాజు కాలును ఎలుగుబంటి కొరికి తినేసింది. రాజు చాలా బాధపడ్డాడు.
రాజును చూసి విష్ణువు, 'రాజా, ఎలుగుబంటి నీ కాలు కొరికింది నీ పూర్వజన్మ పాపం వల్లనే. ఆ పాపానికి ఈ జన్మలో శిక్ష అనుభవిస్తున్నావు' అన్నాడు. దీని నుంచి విముక్తి పొందే మార్గం చెప్పమని రాజు అడిగితే, 'రాజా, నా వరాహ అవతార మూర్తిని పూజించి వరూధిని ఏకాదశి వ్రతం చేస్తే నీ పాపాలు తొలగిపోతాయి, వ్రతం ప్రభావంతో నీకు మళ్లీ అవయవాలు వస్తాయి' అని విష్ణువు చెప్పాడు. ఆ తరువాత రాజు వరూధిని ఏకాదశి వ్రతం చేయగా ఆయన కాలు మళ్లీ బాగుపడింది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం