హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఉగాది కూడా ఒకటి. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి నాడు ఉగాది పండుగను జరుపుకుంటాము. ఈ సంవత్సరం ఉగాది మార్చి 30వ తేదీన వచ్చింది. ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు? ఉగాది చరిత్ర గురించి, ఉగాది పండుగ విశిష్టత గురించి అనేక విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు నూతన సంవత్సరం ఉగాది నుంచి మొదలవుతుంది. అందుకనే తెలుగువారి తొలి పండగ అని పిలుస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది నాడు ఉదయాన్నే తలస్నానం చేయడం, ఇంటిని అందంగా అలంకరించుకోవడం, మామిడాకులు కట్టడం, కొత్త బట్టలు, ఉగాది పచ్చడి ఇలా పలు పద్దతులను పాటిస్తూ ఉంటాము.
ఎన్నో శాసనాల్లో ఉగాది ప్రస్తావన ఉంది. ఉగాది ఇప్పుడు వచ్చింది కాదు. కొన్ని శతాబ్దాలు ముందే మొదలైంది. ఉగాది పండుగ శాతవాహన రాజవంశం నాటితని తెలుస్తోంది. ఈ రాజవంశం 230 బీసీ నుంచి 220 ఏడీ దాకా ఉందట. ఇప్పుడు ఉన్న తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను వీళ్ళు పరిపాలించారు. అప్పటి గ్రంథాలు శాసనాల్లో ఉగాది గురించి ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం