ప్రతీ సంవత్సరం చైత్రమాసం కృష్ణపక్షం ఏకాదశి నాడు వరూథిని ఏకాదశిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం వరూథిని ఏకాదశి ఏప్రిల్ 24న వచ్చింది. ఈరోజు శ్రీమహావిష్ణువుని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. విష్ణుమూర్తి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి. పాపాలు అన్నీ తొలగిపోయి, సంతోషంగా ఉండొచ్చు. వరూథిని ఏకాదశి నాడు ఎటువంటి పొరపాట్లు చేయకూడదు, ఎటువంటి వాటిని పాటిస్తే మంచిది వంటి వివరాలని ఇప్పుడు తెలుసుకుందాం.
వరూథిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం, దానాలు చేయడం వలన శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ రోజు శ్రీమహావిష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి, సంతోషంగా జీవించవచ్చు. అదృష్టం కూడా కలిసి వస్తుంది. ప్రతీ ఏకాదశి రోజు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఎలా అయితే ఆరాధిస్తారో అలాగే వరూథిని ఏకాదశి నాడు కూడా ఆరాధించాలి.
ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి మహా విష్ణువుని ఆరాధించి, ఉపవాస దీక్షని మొదలుపెట్టాలి, ఈరోజు విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవిని కూడా ప్రత్యేకించి ఆరాధించాలి. ఈరోజు తోచినది దానం చేయడం.. పేదలకు, లేని వారికి అవసరాన్ని బట్టి సహాయం చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం