ఈరోజు మహాయోగము.. పంచగ్రహ కూటమితో కూడిన శని త్రయోదశి.. ఇలా చేస్తే శని బాధలు తొలగి సంతోషంగా ఉండచ్చు!-today is maha yogam with pancha graha kutami and shani trayodashi do these to get rid of problems ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈరోజు మహాయోగము.. పంచగ్రహ కూటమితో కూడిన శని త్రయోదశి.. ఇలా చేస్తే శని బాధలు తొలగి సంతోషంగా ఉండచ్చు!

ఈరోజు మహాయోగము.. పంచగ్రహ కూటమితో కూడిన శని త్రయోదశి.. ఇలా చేస్తే శని బాధలు తొలగి సంతోషంగా ఉండచ్చు!

HT Telugu Desk HT Telugu

26 ఏప్రిల్‌ చంద్రుడు మీనరాశిలో ఉండడం, మీనరాశిలోనే బుధుడు, శుక్రుడు, శని, రాహువులు మరియు చంద్రుడు కలిసి పంచగ్రహ కూటమి ఏర్పడటం మరియు శనిత్రయోదశి ఉండడం చేత ఇది విశేష యోగము ఏర్పడిరదని చిలకమర్తి తెలిపారు.

ఈరోజు మహాయోగము.. పంచగ్రహ కూటమితో కూడిన శని త్రయోదశి (pinterest)

చైత్రమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం ఏర్పడిరదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మర్శతీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. 26 ఏప్రిల్‌ 2025 శనివారం త్రన దశి తిథి కలిపి ఏర్పడటం చేత, అందులోను త్రయోదశి సూర్యోదయము నుండి తెల్లవారుజామున 8.35 నిముషాల వరకూ చిలకమర్తి పంచాంగరీత్యా దృక్‌ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఉండుటవలన ఈ రోజు శనిత్రయోదశి పూజలకి, శాంతులకి మరియు నవగ్రహ అభిషేకాలకి ఉత్తమమైన రోజున పంచాంగకర్త చిలకమర్తి తెలిపారు.

పంచగ్రహ కూటమి

26 ఏప్రిల్‌ చంద్రుడు మీనరాశిలో ఉండడం, మీనరాశిలోనే బుధుడు, శుక్రుడు, శని, రాహువులు మరియు చంద్రుడు కలిసి పంచగ్రహ కూటమి ఏర్పడటం మరియు శనిత్రయోదశి ఉండడం చేత ఇది విశేష యోగము ఏర్పడిరదని చిలకమర్తి తెలిపారు.

శని త్రయోదశి మరియు పంచగ్రహ మహాయోగము కూడి ఉన్న రోజు కనుక ఈ రోజు ఏలినాటి శని, అర్థాష్టమ శని, అష్టమ శని, శనిమహర్దశ, శని అంతర్దశ మరియు జాతకములో శనిదోషములు ఉన్నవారు కనుక శనికి ఈరోజు తైలాభిషేకము చేసుకొని, పూజించినట్లైతే వారికి శనిగ్రహ బాధలు తొలగి, శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శనికి అభిషేకాలు

ప్రస్తుతం శని మీనరాశిలో సంచరించడం చేత 26 ఏప్రిల్‌ 2025 నాడు కుంభ, మీన, మేష రాశులవారు (ఏల్నాటి శనిరాశులవారు, సింహరాశివారు (అష్టమశని ప్రభావం), ధనస్సు రాశివారు (అర్థాష్టమశని ప్రభావం) ఉన్నటువంటి వీరంతా కూడా ఈ 26 ఏప్రిల్‌ 2025 కనుక నవగ్రహ ఆలయాలతో శనికి అభిషేకాలు, పూజలు జరిపించి, శివాలయ దర్శనం వంటివి చేసినట్లైతే శుభఫలితాలను పొందగలరని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఈ శనిత్రయోదశి సందర్భంగా శనిసింఘాపూర్‌, తిరునల్లార్‌, మందపల్లి వంటి క్షేత్రాలను దర్శించడం చేత శని బాధలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ