ఈరోజు 16 అక్టోబర్ 2024న శరద్ పూర్ణిమ జరుపుకుంటున్నారు. ఈ రోజు సాయంత్రం లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తారు. ఈ రోజున చంద్రదేవుడు 16 కళలతో ఉంటాడు. ఈ రోజున చంద్రుని కిరణాల నుండి అమృతం వర్షం కురుస్తుందని నమ్ముతారు. అందుకే శరద్ పూర్ణిమ రోజున చంద్రకాంతిలో ఖీర్ ను ఉంచి మరుసటి రోజు దాన్నిసేవిస్తారు. దీంతో శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.
ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఉద్భవించిందని నమ్ముతారు. ఈరోజు లక్ష్మీదేవి భూమి మీదకు వస్తుందని విశ్వాసం. అందుకే ఈ రోజున లక్ష్మీపూజతో పాటు సత్యనారాయన వ్రత కథ కూడా వినిపిస్తుంది. శరద్ పూర్ణిమ రాత్రి గణేశుడిని పూజించడంతో పాటుగా లక్ష్మీ దేవి ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. శరత్ పూర్ణిమ కోసం సింపుల్ రెమెడీస్ తెలుసుకుందాం.
వైవాహిక జీవితంలో ఆనందం కోసం శరత్ పౌర్ణమి రాత్రి చంద్రదేవుడికి భార్యాభర్తలు పచ్చి పాలను సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. భార్యాభర్తల మధ్య నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి.
ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి శరత్ పూర్ణిమ రాత్రి చంద్రోదయం తర్వాత మీరు స్వచ్ఛమైన నీటిలో బియ్యం, పువ్వులు కలిపి జల అర్ఘ్యం సమర్పించవచ్చు. ఇది డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యల నుండి వ్యక్తికి ఉపశమనం కలిగిస్తుందని నమ్ముతారు.
శరత్ పూర్ణిమ రాత్రి చంద్రకాంతిలో ఖీర్ తయారు చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ రోజున చంద్రదేవుడు 16 కళలతో నిండి ఉంటాడని అంటారు. అటువంటి పరిస్థితిలో చంద్రకాంతి పడినప్పుడు, అమృతం ఖీర్లోకి ప్రవేశిస్తుంది. ఈ ఖీర్ తీసుకోవడం వల్ల కుటుంబానికి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగి ఆరోగ్యం బాగుంటుంది.
శరత్ పూర్ణిమ రోజున లక్ష్మీదేవి భూమిని సందర్శిస్తుంది. ఈ కాలంలో లక్ష్మీ దేవిని పూజించడం చాలా పవిత్రమైనది, ఫలవంతమైనదిగా భావిస్తారు. పూజ సమయంలో లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగించండి. సాయంత్రం పూజలో కరివేపాకు, శంఖం, పసుపు సమర్పించాలి.
లక్ష్మీదేవికి గులాబీ పూల దండను సమర్పించండి. వారికి తెలుపు స్వీట్లు అందించండి. ఇది కాకుండా విష్ణు సహస్ర నామం, కనకధార స్తోత్రం లేదా శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఇలా చేయడం వల్ల మనిషికి ఎలాంటి డబ్బు సంబంధిత సమస్యలు ఉండవని, లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని నమ్ముతారు.
లక్ష్మీదేవికి సంబంధించిన రత్నాలు ధరించవచ్చు. ముత్యాలు, వజ్రం చంద్రరాతి వంటి వాటిని పెట్టుకోవచ్చు. ఇవి ధరించడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. సమృద్ధి, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. అలాగే అమ్మవారికి పసుపు, కుంకుమ, చందనం సమర్పించాలి. ఇది జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని, విజయం, ఆనందాన్ని తీసుకొస్తుంది. మీ ఆకాంక్షలు నెరవేరుస్తుంది.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్