Temple prasadam: ఈ ఆలయాల్లో నూడిల్స్, ఆల్కాహాల్ ప్రసాదం..!-this kolkata temple serves noodles as prasadam ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Temple Prasadam: ఈ ఆలయాల్లో నూడిల్స్, ఆల్కాహాల్ ప్రసాదం..!

Temple prasadam: ఈ ఆలయాల్లో నూడిల్స్, ఆల్కాహాల్ ప్రసాదం..!

Gunti Soundarya HT Telugu

Temple prasadam: మన దేశంలో ఉన్న కొన్ని ఆలయాల్లో పెట్టె ప్రసాదం గురించి వింటే ఆశ్చర్యపోతారు. కోల్ కతాలోని ఆలయంలో నూడిల్స్ ప్రసాదంగా పెడతారు.

ప్రసాదంగా నూడిల్స్(Representational image) (pixabay)

Temple prasadam: గుడిలో పెట్టె ప్రసాదం అంటే పులిహోర, దద్దోజనం, పొంగలి, కొబ్బరి ముక్క పెడుతూ ఉంటారు. భారతదేశంలో ఫేమస్ ప్రసాదాలు అంటే తిరుపతి లడ్డు, అన్నవరం, అయ్యప్ప స్వామి ప్రసాదం. ఈ ప్రసాదాలు అంటే ఎంతో మంచిది విపరీతమైన ఇష్టం.

పూజా కార్యక్రమాలు ముగించుకున్న తర్వాత భక్తులకి ప్రసాదం పంపిణీ చేస్తారు. కానీ ఇక్కడ ఒక ఆలయంలో ప్రసాదం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకీ అదేంటో తెలుసా నూడిల్స్. అవును మీరు విన్నది నిజమే. ఈ ఆలయం ఎక్కడో లేదు పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా లో ఉంది.

నూడిల్స్ ప్రసాదంగా..

కోల్ కతాలోని తంగ్రా ప్రాంతంలో కాళీమాత ఆలయం ఉంది. ఈ ఆలయం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. భక్తులకి ఇక్కడ ప్రసాదంగా నూడిల్స్, సూప్, చాప్ స్టూ అందిస్తారు. ఈ ఆలయాన్ని చైనీస్ ఆలయం అని కూడా పిలుస్తారు. చైనీయులు ఇక్కడికి ఎక్కువగా దర్శనం చేసుకునేందుకు వస్తారు. వాళ్ళు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటారు. అందుకే ప్రసాదంగా వారికి ఇష్టమైన నూడిల్స్ ప్రసాదంగా పెడుతున్నారు. అది మాత్రమే కాదు ఇక్కడికి వచ్చే చైనీయులని చాలా గౌరవంగా చూసుకుంటారు.

దాదాపు 20 ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ చైనీయులు నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న కాళీమాత ఆలయంలో కూడా చైనా సాంప్రదాయాలు పాటిస్తారు. గతంలో ఈ ప్రాంతంలో నివసిస్తున్న ఒక బాలుడికి అనారోగ్యం చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత మందికి చూపించినా అతడికి అనారోగ్యం తగ్గలేదు. ఒకరోజు ఈ దేవాలయంలోని కాళీమాత దగ్గర పూజలు చేసిన తర్వాత ఆ బాలుడి ఆరోగ్యం కుదుటపడిందని చెప్తారు.

ఇవి మాత్రమే కాదు భారత్ లోని ఎన్నో ఆలయాల్లో పెట్టె ప్రసాదాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని చోట్ల మద్యం ప్రసాదంగా పెడితే మరో చోట బిర్యానీ, దోస ప్రసాదంగా పెడతారు.

మద్యం ప్రసాదం..

పవిత్రమైన ప్రదేశాలలో వారణాని ఒకటి. ఇక్కడ ఉన్న ఒక ఆలయంలో మద్యం దేవుడిని నైవేద్యంగా సమర్పించి అదే ప్రసాదంగా తీసుకుంటారు. వారణాసిలో కాలభైరవ ఆలయంలో భక్తులు నేరుగా విగ్రహం నోట్లో మద్యం పోస్తారు. దాన్నే ప్రసాదంగా తీసుకుంటారు. ఈ ఆలయం బయట మద్యం అమ్మకాలు జరుగుతాయి. యూపీలోని లక్నోలో ఖబీస్ బాబా ఆలయంలో కూడా ఆల్కాహాల్ నైవేద్యంగా పెడతారు.

బిర్యానీ ప్రసాదం

సాధారణంగా ఆలయం దగ్గరలో కూడా మాంసాహారం తీసుకురారు. కానీ ఇక్కడ మాత్రం ఆలయంలో ఏకంగా మటన్, చికెన్ బిర్యానీలు ప్రసాదంగా పెడతారు. తమిళనాడులోని మధురైలో ఉన్న మునియాండి స్వామి దేవాలయంలో ప్రసాదాలుగా బిర్యానీ పెడతారు. ఏటా జనవరిలో జరిగే వార్షిక ఉత్సవాల్లో గుడికి వచ్చిన భక్తులకి బిర్యానీ ప్రసాదంగా పంపిణీ చేస్తారు. దాదాపు 80 ఏళ్లకి పైగా ఇదే ఆచారం కొనసాగుతుంది.