భారతదేశంలో అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో కాశీ ఒకటి. దీనిని బనారస్, వారణాసి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ప్రపంచంలో అత్యంత పురాతనమైన జనవాస నగరాల్లో కాశీ ఒకటి. కాశీని శివుని నగరం అని కూడా అంటారు. ఈ నగరాన్ని శివుడు స్థాపించినట్లు భావిస్తారు.
కాశీలో ఎవరైనా మరణిస్తే, ఖచ్చితంగా వారికి మోక్షం లభిస్తుంది అని అంటారు. ఇది ఇలా ఉంటే కాశి లో ఉన్న మణికర్ణిక ఘాట్ గురించి మన అందరికీ తెలుసు. మణికర్ణిక ఘాట్ కి సంబంధించి కొన్ని రహస్యాలు చాలా మందికి తెలీదు. ఈరోజు ఈ ఘాట్ కి సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
మణికర్ణిక ఘాట్ ని మోక్షదాయిని అని అంటారు. మృతదేహాలని ఇక్కడ దహనం చేస్తారు. ఇక్కడ ఎవరి దేహం అయితే దహనం చేస్తారో వారికి జనన మరణం చక్రం నుంచి విముక్తి లభిస్తుంది. కానీ ఈ నలుగురి మృతదేహాలని కాల్చడం నిషేధం. మరి ఎవరు మృతదేహాలను ఇక్కడ కాల్చకూడదు, ఎందుకు కాల్చకూడదు వంటి విషయాలని తెలుసుకుందాం.
మణికర్ణిక ఘాట్ లో సాధువుల మృతదేహాలను దహనము చేయరు. వారిని ఎప్పుడూ కూడా జల సమాధి చేస్తారు.
మణికర్ణిక ఘాట్లో తీవ్రమైన చర్మ సమస్యలతో బాధపడి చనిపోయిన వారి మృతదేహాలని దహనం చేయకూడదు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిని దహనం చేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన బ్యాక్టీరియా గాలిలో వ్యాపిస్తుంది. దాని కారణంగా ఇతరులు ఎఫెక్ట్ అవుతారని ఇలా చేయరు.
చిన్నపిల్లల్ని కూడా మణికర్ణిక ఘాట్ లో దహనం చేయరు. పిల్లల్ని భగవంతుని స్వరూపంగా భావిస్తారు. కాబట్టి వారి మృతదేహాన్ని మట్టిలో పూడ్చుతారు.
మత విశ్వాసాల ప్రకారం మణికర్ణిక ఘాట్ లో గర్భిణీ స్త్రీల అంత్యక్రియలు చేయరు. గర్భిణీ స్త్రీ మృతదేహాన్ని కాల్చినట్లయితే ఆమె కడుపులో ఉన్న పిండం బయటకు వస్తుంది. అందుకే పూడ్చుతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం