Pooja room: పూజ గదిలో ఈ ఏడు వస్తువులు ఉన్నాయంటే విజయం, అదృష్టం మీ సొంతం
Pooja room: పూజ గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన ఏడు వస్తువులు ఇవి. వీటి వల్ల మీ అదృష్టం, విజయం రెట్టింపు అవుతుంది. దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆ వస్తువులు ఏంటి వాటి ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
Pooja room: ఇంట్లో పవిత్రమైన ప్రదేశం పూజ గది. హిందూ సంస్కృతిలో దీనికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. కుటుంబమంతా కలిసి కూర్చుని ప్రార్థన చేసేందుకు, ధ్యానం చేసేందుకు, అంతర్గత శాంతిని పెంపొందించుకునేందుకు ఉపయోగపడే ప్రదేశం ఇది.
సంబంధిత ఫోటోలు
Feb 19, 2025, 06:00 AMఈ రాశులకు ఆకస్మిక ధన లాభం! జీవితంలో సంతోషం- ఇక అన్ని కష్టాలు దూరం..
Feb 17, 2025, 12:25 PM43 రోజుల పాటు ఈ రాశులకు మెండుగా అదృష్టం.. ఆర్థికంగా, మానసికంగా ప్రయోజనాలు!
Feb 17, 2025, 09:40 AMVenus Transit: పూర్వాభాద్ర నక్షత్రంలో శుక్రుడు.. ఈ 3 రాశులకు అదృష్టం, కొత్త అవకాశాలు, ధనం, సంతోషంతో పాటు ఎన్నో
Feb 17, 2025, 06:00 AMఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ 3 రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు! భారీగా ధన లాభం, అన్ని కష్టాలు దూరం..
Feb 15, 2025, 01:09 PMBudhaditya Yoga: కుంభరాశిలో సూర్యుని రాక, బుద్ధాదిత్య రాజ యోగం- ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్ మొదలు, ఉద్యోగ అవకాశాలు!
Feb 15, 2025, 08:07 AMShani Transit: శని సంచారం, 2025లో డబ్బుల వర్షం కురుస్తుంది.. ఈ మూడు రాశుల వారికి సంతోషం
పూజ గది ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకునేందుకు, విజయం శ్రేయస్సును ఆహ్వానించేందుకు ఈ గదిలో కొన్ని పవిత్రమైన వస్తువులు ఉంచుకోవడం మంచిది. ఇది సానుకూల శక్తులను ప్రసారింప చేయడమే కాకుండా దైవిక ఆశీర్వాదాలు ఆకర్షించేందుకు ఉపయోగపడుతుంది. పూజ గదిలో తప్పనిసరిగా ఉండాల్సిన ఏడు వస్తువులు ఏవో తెలుసుకుందాం.
దీపం
హిందూ సంప్రదాయం ప్రకారం ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం ఒక ఆచారం. ఇది జ్ఞానాన్ని సూచిస్తుంది. చీకటిని పారద్రోలుతోందని నమ్ముతారు. మంచి మార్గం వైపు నడిపిస్తుందని భావిస్తారు. అందుకే పూజ గదిలో తప్పనిసరిగా దీపాన్ని వెలిగించాలి. ఇది జ్ఞానం ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రతీక. జీవితంలో సానుకూలత పెంపొందించుకునేందుకు దీపం ఉత్తమమైన మార్గంగా పరిగణిస్తారు. పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత దానంతట అది కొండెక్కింతవరకు ఉంచాలి.
ధూపం
పూజలో తప్పనిసరిగా అగరబత్తులు వాడతారు. ఈ ధూపం స్టిక్స్ నుంచి వచ్చే పొగ పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనికి శుద్ధి వైద్యం చేసే లక్షణాలు కలిగి ఉంటాయి. క్రమం తప్పకుండా ఇంట్లో ధూపం వేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. వాటి నుంచి విలువడే సువాసన మనసుని ప్రశాంత పరుస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ధ్యానం ఆధ్యాత్మిక అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది.
గంట
గంట లేకుండా ఏ పూజ పూర్తి కాదు. పూజ పూర్తయిన తర్వాత గంట కొడుతూ హారతి ఇస్తారు. దీని ప్రతిధ్వని శుద్ధి చేసే లక్షణాలు కలిగి ఉంటుందని నమ్ముతారు. దీని నుంచి వెలువడే శబ్దం గాలిలో ఉండే సూక్ష్మజీవులను తొలగిస్తుంది. ప్రతికూల శక్తులను తిప్పి కొడుతుం.ది సానుకూల శక్తులను ఆహ్వానిస్తుంది. పూజగదిని పవిత్రం చేస్తుంది. లోతైన ఆధ్యాత్మిక భావాన్ని మెరుగుపరుస్తుంది.
గంగా జలం
పవిత్రమైన నది నుంచి తీసుకువచ్చిన గంగాజలం పూజ గదిలో ఉంచుకోవడం చాలా మంచిది. ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇంటికి రక్షణగా ఉంటుంది. ఈ పవిత్ర జలం ప్రతికూల శక్తులను తరిమికొడుతుంది. పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రతిరోజు పూజగది చుట్టూ కొన్ని చుక్కల గంగాజలం చిలకరించడం వల్ల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక శక్తి మెరుగుపడుతుంది.
పవిత్ర గ్రంథాలు
పూజ గదిలో భగవద్గీత, రామాయణం వంటి ఇతర పవిత్ర గ్రంథాలు ఉంచుకోవడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇది ఆధ్యాత్మిక శక్తిని ప్రేరేపిస్తుంది. వీటిని పఠించడం ద్వారా ఆధ్యాత్మికత మెరుగుపడుతుంది. జ్ఞానం, శ్రేయస్సు, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పూజ గదిలో పవిత్ర గ్రంథాల ఉనికి వ్యక్తిగత ఎదుగుదలకు, ఆధ్యాత్మిక అభివృద్ధికి తోడ్పడుతుంది.
దేవతా విగ్రహాలు
పూజ గదిలో వినాయకుడు, లక్ష్మీదేవి, శివుడు, శ్రీరాముడి చిత్రపటాలు లేదా విగ్రహాలు ఉంచడం వల్ల పవిత్రమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ దేవతలను క్రమం తప్పకుండా ఆరాధించడం వల్ల ఇంటికి దైవిక ఆశీర్వాదాలు శ్రేయస్సు రక్షణ లభిస్తాయి. అయితే కుటుంబ సభ్యులు లేదా పూర్వీకుల చిత్రాలను పూజ గదిలో పొరపాటున కూడా పెట్టకూడదు. ఇది ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అలాగే విరిగిన, చినిగిపోయిన విగ్రహాలు, చిత్రపటాలు పూజ గదిలో ఉంచకూడదు. వాటిని వెంటనే తొలగించి సరైన వాటిని మళ్ళీ ప్రతిష్టించుకోవాలి.
తాజా పూలు
హిందూ సంప్రదాయంలో పువ్వులు లేకుండా పూజ పూర్తి కాదు. ఇవి స్వచ్ఛతకు చిహ్నం. దేవతలను ప్రసన్నం చేసుకునేందుకు ఉపయోగపడతాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. పూల వాసన శాంతియుత వాతావరణాన్ని పెంపొందిస్తుంది. భక్తుడి మనసును శుద్ధి చేస్తుంది. పూజ గదిలో తాజా పుష్పాలు దేవునికి సమర్పించడం వల్ల దైవంతో సంబంధం మెరుగుపడుతుంది.