గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తాడు. ఆగస్టు 17న గ్రహాలకి రాజు అయినటువంటి సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. కేతువు ఇప్పటికే సింహ రాశిలో ఉన్నాడు. దీంతో సూర్య–కేతువుల సంయోగం జరుగుతుంది. 18 ఏళ్ల తర్వాత సూర్య–కేతువుల సంయోగం జరగనుంది.
ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను, కొన్ని రాశుల వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశుల వారు మాత్రం సూర్య–కేతువుల సంయోగం వలన ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగ పరంగా కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఏ రాశుల వారికి సూర్య–కేతువుల సంయోగం సమస్యలను తీసుకొస్తుంది? ఎవరు ఎలాంటి నష్టాలను ఎదుర్కోవాలి?
సింహ రాశి వారికి సూర్య–కేతువుల సంయోగం సమస్యలు తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి సామర్థ్యం, నమ్మకం తగ్గుతాయి. ఈ సమయంలో ఈ రాశి వారు ఉద్యోగ పరంగా కూడా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు ఈ సమయంలో ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. ఎవరికైనా అప్పు ఇవ్వడం, ఎవరి దగ్గర నుంచైనా అప్పు తీసుకోవడం కూడా మంచిది కాదు.
కుంభ రాశి వారికి సూర్య–కేతువుల సంయోగం నష్టాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారి వైవాహిక జీవితంలో సమస్యలు రావచ్చు. వైవాహిక జీవితంలో టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
మీన రాశి వారికి సూర్య–కేతువుల సంయోగం నష్టాలను తీసుకువస్తుంది. ఈ రాశి వారు అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కోర్టు కేసులతో ఇబ్బంది పడేవారు ఉపశమనాన్ని పొందలేకపోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.