మార్చి 29, 2025 శనివారం ఫాల్గుణ మాస అమావాస్య చంద్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రం మీనరాశిలో ఉండగా, సూర్యుడు, చంద్రుడు, రాహువు ముగ్గురు మీన రాశిలో సంచరించే సమయంలో రాహుగ్రస్త్ర సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
చిలకమర్తి పంచాంగ రీత్యా, ధృక్ సిద్ధాంత పంచాంగ రీత్యా ఆధారంగా ఈ సూర్యగ్రహణం భారతదేశంలో సంభవించడం లేదని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. భారతదేశంలో ఈ సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించకపోవడం చేత భారతదేశంలో ఉండువారు ఈ సూర్యగ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదని అన్నారు. భారతదేశంలోని ఆలయాలను మూసివేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపారు.
ఈ సంపూర్ణ సూర్య గ్రహణం అమెరికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, కెనడా, ఐరోపా, ఆఫ్రికా మరియు కొన్ని పశ్చిమ దేశాలలో కనిపించొచ్చని చిలకమర్తి తెలిపారు. ఉత్తరాబాధ్ర నక్షత్రం మీనరాశిలో ఈ సూర్య గ్రహణం ఏర్పడటం చేత, ఈ గ్రహణం ఏ దేశాల్లో అయితే సంభవిస్తుందో ఆ దేశాల్లో నివసించు భారతీయులు ముఖ్యంగా మీన, కన్య రాశుల వారు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిదని చిలకమర్తి తెలిపారు.
ఈ రకంగా సూర్య గ్రహణ నియమాలను పాటిస్తూ సూర్యారాధన, రాహుగ్రహ జపం, దుర్గాదేవీ ఆరాధన చేసిన వారికి శుభఫలితాలు కలుగుతాయని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం