శ్రీశైలమల్లికార్జునుడుని ఒక్కసారి దర్శిస్తే, మహా దానాలు చేసినంత ఫలం కలుగుతుంది!-significance of visiting srisailam mallikarjuna temple ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శ్రీశైలమల్లికార్జునుడుని ఒక్కసారి దర్శిస్తే, మహా దానాలు చేసినంత ఫలం కలుగుతుంది!

శ్రీశైలమల్లికార్జునుడుని ఒక్కసారి దర్శిస్తే, మహా దానాలు చేసినంత ఫలం కలుగుతుంది!

HT Telugu Desk HT Telugu

శ్రీశైలం శైవ భక్తులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. ఈ ఆలయ చరిత్ర ఎన్నో శతాబ్దాల క్రితం మొదలైందని భావించబడుతుంది. శివపార్వతుల ప్రేమకు, పరమశివుని అనుగ్రహానికి నిలువెత్తు ఉదాహరణ. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో తెలుసుకోండి.

శ్రీశైలమల్లికార్జునుని ఒక్కసారి దర్శిస్తే ఎంత పుణ్యమో తెలుసా? (pinterest)

శ్రీశైలం శైవ భక్తులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన క్షేత్రం. శ్రీ ఆది శంకరాచార్యులు కూడా ఇక్కడ పాదయాత్ర చేశారు. ఈ ఆలయ చరిత్ర ఎన్నో శతాబ్దాల క్రితం మొదలైందని భావించబడుతుంది. శివపార్వతుల ప్రేమకు, పరమశివుని అనుగ్రహానికి నిలువెత్తు ఉదాహరణ.

ఆత్మాన్వేషణకు పునాది

నరుల పాపాలను హరించగల పవిత్ర తీర్థక్షేత్రంగా భావించబడుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. శ్రీశైల యాత్ర అనేది భక్తికి, త్యాగానికి, శాంతికి మార్గదర్శకమవుతుంది. ఇది కేవలం ఒక యాత్ర మాత్రమే కాకుండా ఆత్మాన్వేషణకు పునాది.

12 జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీమల్లికార్జునస్వామికి 18 శక్తిపీఠాలో ఒకరైన శ్రీభ్రమరాంబాదేవికి నిలయమైన ఈ మహా క్షేత్రం వేదములకు ఆలవాలమై, సకల సంపదలకు పుట్టినిల్లై. ఎనిమిది శృంగాలతో, 44 నదులతో, 60 కోట్ల తీర్థరాజాలతో పరాశర, భరద్వాజాది మహర్షుల తపోవనాలతో చంద్రగుండ, సూర్యగుండాది పుష్కరిణులతో, స్పర్శవేదులైన లతలు, చెట్లు మరియు లింగాలతో అనంతమైన ఓషధులతో విరాజిల్లుతూ యాత్రికుల మనస్సులను ఎంతగానో ఆకట్టుకుంటోంది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

శ్రీశైలమల్లికార్జునుని ఒక్కసారి దర్శిస్తే ఎంత పుణ్యమో తెలుసా?

కురుక్షేత్రంలో లక్షలకొలదీ దానమిచ్చినా రెండు వేల సార్లు గంగా స్నానం చేసినా, నర్మదా నదీ తీరంలో బహుకాలం తపస్సాచరించినా, కాశీక్షేత్రంలో లక్షల సంవత్సరాలు నివసించినా ఎంత పుణ్యం లభిస్తుందో అంతటి మహాపుణ్యం శ్రీశైలమల్లికార్జునుని ఒక్కసారి దర్శించినంతనే కలుగుతుందని స్కాందపురాణం చెబుతోంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మహాదానాలు చేసినంత ఫలం

శిఖర దర్శన మాత్రాన, అనంతమైన పుణ్యాన్ని సంతరించి పెట్టి పునర్జన్మ నుండి ముక్తిని కలిగించే ఈ క్షేత్రాన్ని ఆయా మాసాలలో సందర్శించేవారు వాజపేయ అతిరాత్ర మొదలైన మహాయజ్ఞాలు ఆచరించినందు వల్ల కలిగే ఫలాన్ని, కన్యా దానం, గోదానం మొదలైన మహాదానాలు చేసినందు వల్ల కలిగే ఫలాన్ని అనాయాసంగా పొందుతారని శివుడు పార్వతికి స్వయంగా చెప్పినట్లు స్కాందపురాణం చెబుతున్నది అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు- 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు- 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు- 9494981000
హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.