శని తిరోగమనంతో 138 రోజుల పాటు ఈ మూడు రాశులకు చిన్నపాటి సమస్యలు.. టేక్ కేర్!-shani retrograde will bring problems to these 3 rasis for 138 days take care during this time ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శని తిరోగమనంతో 138 రోజుల పాటు ఈ మూడు రాశులకు చిన్నపాటి సమస్యలు.. టేక్ కేర్!

శని తిరోగమనంతో 138 రోజుల పాటు ఈ మూడు రాశులకు చిన్నపాటి సమస్యలు.. టేక్ కేర్!

Peddinti Sravya HT Telugu

138 రోజుల పాటు శని తిరోగమనంలో ఉంటాడు. శని తిరోగమనంతో మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. కానీ మూడు రాశుల వారికి మాత్రం చిన్నపాటి సమస్యలు వస్తాయి. మరి ఇక ఏయే రాశులకు ఇబ్బందులు ఉంటాయో తెలుసుకోండి.

శని తిరోగమనంతో ఈ మూడు రాశుల వారికి కష్టాలు

2025లో శని గమనం చాలా ప్రత్యేకమైనది. శని స్థానంలో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముందు ఈ ఏడాది మార్చి 29న శని మీన రాశిలోకి ప్రవేశించాడు. త్వరలో శని తిరుగమనం చెందుతాడు. జూలై 13, 2025 నుంచి నవంబర్ 28, 2025 వరకు తిరోగమనంలో ఉంటాడు.

138 రోజుల పాటు శని తిరోగమనంలో ఉంటాడు. శని తిరోగమనంతో మూడు రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. కానీ మూడు రాశుల వారికి మాత్రం చిన్నపాటి సమస్యలు వస్తాయి. మరి ఆ మూడు రాశులు వారు ఎవరో చూసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

శని తిరోగమనంతో ఈ మూడు రాశుల వారికి కష్టాలు

1.మేష రాశి

మేష రాశి వారికి శని తిరోగమనం వలన చిన్నపాటి ఇబ్బందులు వస్తాయి. వ్యాపారులకి ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా కలగవచ్చు. మేష రాశి వారికి వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఒత్తిడి పెరిగిపోతుంది.

2.మిధున రాశి

మిధున రాశి వారికి శని శిరోగమనం వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులకి కెరియర్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వ్యాపారులకి కూడా కొన్ని నష్టాలు తప్పవు. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది.

3.సింహ రాశి

సింహ రాశి వారికి శని తిరోగమనంవలన కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. సింహ రాశి వారు కూడా కొంత నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆస్తి నష్టం తో పాటుగా చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు మారకండి. కెరియర్ లో కూడా ఎత్తు పల్లాలు ఉండే అవకాశం ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం