కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ చదివిన మహాలక్ష్మీ అష్టకంలోని పంక్తులు-prime minister narendar modi said these lines from maha lakshmi ashtakam before starting budget session ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ చదివిన మహాలక్ష్మీ అష్టకంలోని పంక్తులు

కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ చదివిన మహాలక్ష్మీ అష్టకంలోని పంక్తులు

Peddinti Sravya HT Telugu

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మీడియా సమావేశం నిర్వహించి బడ్జెట్ అంచనాలను తెలియజేశారు.అదే సమయంలో లక్ష్మీదేవిని స్తుతిస్తూ రెండు లైన్లు చదివారు.అవి మహాలక్ష్మి అష్టకం పంక్తులు.మహాలక్ష్మీ అష్టకాన్ని పూర్తిగా తెలుసుకుందాం.

కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ చదివిన మహాలక్ష్మీ అష్టకంలోని పంక్తులు

జనవరి 31 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు పార్లమెంటు హౌస్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన లక్ష్మీ స్తోత్ర పంక్తులు పఠించారు.శుభ ఫలాల కోసం మహాలక్ష్మిని ప్రార్థించడం ఆనవాయితీ అని అన్నారు.

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భూక్తిముక్తిప్రదాయిని |

మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తు తే |

ఈ పంక్తులను చాలా స్పష్టంగా పఠించిన ప్రధాని నరేంద్ర మోదీ పేద, మధ్యతరగతి ప్రజలకు లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు

బడ్జెట్ సమావేశాలకు ముందు సంపద, శ్రేయస్సుకు అధిదేవత లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను. లక్ష్మీదేవి మన దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ప్రజాస్వామ్య దేశంగా భారత్ 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వకారణమని ప్రధాని మోదీ అన్నారు.

మహాలక్ష్మి అష్టకం

నమస్తేసు మహామాయే శ్రీపీఠం సురపుజిత్ |

శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోయేస్తు తే ||1 ||

నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి ।

సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥

సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి ।

సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥

సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని ।

మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥

ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి ।

యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే ।

మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి ।

పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే ।

జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥

మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః ।

సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥ 9 ॥

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ ।

ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥ 10 ॥

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ ।

మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥ 11 ॥

మహాలక్ష్మీ అష్టకం వలన లాభాలు

ఇంట్లో సౌభాగ్యం కలుగుతుందని నమ్ముతారు.ఈ మహాలక్ష్మి అష్టకం వినడం ద్వారా ఆధ్యాత్మిక ఆనందాన్ని, మనశ్శాంతిని కూడా పొందవచ్చని మేధావులు చెబుతున్నారు.