గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే, ఇప్పుడు నవ పంచమ రాజయోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులు వారి అదృష్టం మారిపోతుంది.
జ్యోతిష్య లెక్కల ప్రకారం మకర రాశిలో యముడు స్థానం కారణంగా నవ పంచమ రాజయోగం ఏర్పడనుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ మూడు రాశుల వారికి మాత్రం బాగా కలిసి వస్తుంది. సానుకూల మార్పుల్ని చూస్తారు. మరి నవ పంచమ రాజయోగం ఏ రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతోంది, ఎవరు ఎలాంటి లాభాలు పొందుతారో తెలుసుకుందాం. వీరిలో మీరు ఒకరు అవ్వచ్చు, చూసుకోండి.
శుక్రుడు విలాసాలు, డబ్బు మొదలైన వాటికి కారకుడు. ప్రస్తుతం శుక్రుడు సింహ రాశిలో ఉన్నాడు. కన్యారాశిలోకి అక్టోబర్ 9న ప్రవేశించబోతున్నాడు. అదే విధంగా సూర్యుడు ఆ సమయానికి కన్యా రాశిలో ఉంటాడు. నవ పంచమ రాజయోగంతో ఈ రాశుల వారికి అనేక లాభాలు కలుగుతాయి.
వృషభ రాశి వారికి నవ పంచమ రాజయోగం అనేక విధాలుగా కలిసివస్తుంది. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. పిల్లలు కలిగే అవకాశం ఉంది. విద్యార్థులు కష్టానికి తగ్గ ఫలితాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఉండడం మంచిది. పెద్ద పెద్ద రిస్కులు తీసుకోకూడదు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
కర్కాటక రాశి వారికి ఈ యోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు సానుకూల మార్పులను చూస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ గొడవలన్నీ తీరిపోతాయి. ప్రశాంతత ఉంటుంది, సంతోషంగా ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి.
వృశ్చిక రాశి వారికి నవ పంచమ రాజయోగం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు అనేక విధాలుగా లాభాలను పొందుతారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారులకి కూడా ఇది మంచి సమయం. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.