Mysterious Temples Of India: భారతీయ ఆలయంలో వందల సంవత్సరాల నుండి.. 9 సహజమైన నీలి మంటలు మండుతున్నాయని మీకు తెలుసా?-mysterious temples of india from past 100 years nine blue flames are burning in this temple ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mysterious Temples Of India: భారతీయ ఆలయంలో వందల సంవత్సరాల నుండి.. 9 సహజమైన నీలి మంటలు మండుతున్నాయని మీకు తెలుసా?

Mysterious Temples Of India: భారతీయ ఆలయంలో వందల సంవత్సరాల నుండి.. 9 సహజమైన నీలి మంటలు మండుతున్నాయని మీకు తెలుసా?

Peddinti Sravya HT Telugu
Jan 01, 2025 09:00 AM IST

Mysterious Temples Of India: హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాల దేవి ఆలయం. సాధారణంగా ఏ ఆలయంలో అయినా దేవుడు లేదా దేవత విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ పూజించడానికి విగ్రహం లేదు. అక్కడ మంటలు ఉంటాయి

Mysterious Temples Of India: భారతీయ ఆలయంలో వందల సంవత్సరాల నుండి 9 సహజమైన నీలి మంటలు
Mysterious Temples Of India: భారతీయ ఆలయంలో వందల సంవత్సరాల నుండి 9 సహజమైన నీలి మంటలు (pinterest)

భారతదేశం వేలాది దేవాలయాలకి నిలయం. కొన్ని విజ్ఞానం మరియు తర్కాన్ని కూడా ధిక్కరిస్తాయి. అందులో ఒకటి హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాల దేవి ఆలయం. సాధారణంగా ఏ ఆలయంలో అయినా దేవుడు లేదా దేవత విగ్రహం ఉంటుంది. కానీ ఇక్కడ పూజించడానికి విగ్రహం లేదు. అక్కడ మంటలు ఉంటాయి. సాధారణ మంటలు కావు ఇవి.

yearly horoscope entry point

వేల సంవత్సరాలుగా మంటలు..

ఇవి వందల సంవత్సరాల నుంచి భూమి నుంచి లేచి పగలు రాత్రి మండుతున్న నిజమైన మంటలు. సమాచారం ప్రకారం, వేల సంవత్సరాలుగా మంటలు చెలరేగుతూ ఉన్నాయి.

ఎంత వర్షం కురిసినా ఎంత గాలి వీచినా కూడా అవి ఆరిపోవట్లేదు. భూమికి సంబంధించి ఎంతో రహస్యం దాగి ఉందని కొందరు అంటూ ఉంటారు. ఈ ఆలయం అనేక ఆసక్తికరమైన కథలతో ముడిపడి ఉంది.

సతీదేవి నాలుక జ్వాలాముఖిలో పడింది

పాండవులు నిర్మించిన మొదటి ఆలయం అని చాలా మంది నమ్ముతారు. పురాణాల ప్రకారం చూసినట్లయితే సతీదేవి శరీరం 50 యొక్క భాగాలుగా విడిపోయినప్పుడు.. నాలుక జ్వాలాముఖి అనే ప్రాంతంలో పడింది.

ఈ పవిత్ర స్థలంలో శాశ్వతమైన మంటలు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఆమె యోగశక్తిని సూచిస్తుంది. సతి దేవి బట్టలు ఇక్కడ పడిపోయినప్పుడు మంటల్లో చిక్కుకున్నాయని ఎప్పటికీ బయటకు వెళ్లలేదని చెప్తారు.

మరో కథ ఏం చెప్తోందంటే..

అలాగే ఇంకో కథ ప్రకారం, మొగల్ చక్రవర్తి అక్బర్ ప్రసిద్ధ జ్వాలా దేవి ఆలయాన్ని సందర్శించి ఇనుప డిస్క్ తో, నీటితో ఆ మంటల్ని ఏర్పడానికి ప్రయత్నం చేశారని.. అయినా కూడా మంటలు ఆరిపోలేదని అక్బర్ దేవత యొక్క శక్తిని విశ్వసించలేదు కాబట్టి అతను మొదట మందిరం దగ్గర బంగారు గొడుగుని సమర్పించాడు.

అతను ఆశ్చర్యానికి అది ఒక వింత మెటల్ గా మారుతుంది. ఈ సమయంలో అతను దేవత యొక్క శక్తిని విశ్వసించడం ప్రారంభించాడు. ఈ మంటలను శాస్త్రవేత్తలు పరిశోధించారు.

తొమ్మిది కిలోమీటర్ల లోతు తవ్వినా కాంక్రీట్ తప్ప ఏమీ కనిపించలేదని సరస్వతి, అన్నపూర్ణ, చండీ, హింగ్లా, వాసిని, మహాలక్ష్మి, మహాకాళి, అంబికా, అంజనా యొక్క వివిధ రూపాలను సూచిస్తూ ఈ జ్వాలలు ప్రసరించే మొత్తం తొమ్మిది ఉన్నాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం