ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం ఏకాదశి నాడు మోహినీ ఏకాదశిని జరుపుకుంటాము. ఈసారి మోహినీ ఏకాదశి మే 8వ తేదీన వచ్చింది. విష్ణువుని ఈరోజు భక్తులు ఈ విధంగా ఆరాధించడం వలన జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి, సంతోషంగా ఉండొచ్చు.
మోహినీ ఏకాదశి నాడు కొన్ని పొరపాట్లు కూడా చేయకుండా చూసుకోవాలి. మరి మోహినీ ఏకాదశి నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎటువంటి మంత్రాలని పఠిస్తే మంచిది ఇటువంటి విషయాలని ఇప్పుడే తెలుసుకుందాం.
మోహినీ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. సమస్యలన్నీ తొలగిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు. ఈరోజు ఉపవాసం ఉన్నవారు పండ్లు, పాలు తీసుకోవచ్చు.
ఈ మంత్రాన్ని పఠిస్తే విష్ణువు అనుగ్రహాన్ని పొందవచ్చు. విష్ణువు జీవితంలో ఆనందాన్ని, ప్రశాంతతనీ ఇస్తాడు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.