చిలకమర్తి పంచాంగం రీత్యా, దృక్సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా 26 ఏప్రిల్ 2025 శనివారం ఉదయం 8 గంటల 35 నిముషాల వరకు త్రయోదశి తిథి, తదుపరి రాత్రి వరకు చతుర్దశి తిథి ఉండడం చేత 26 ఏప్రిల్ 2025 మాస శివరాత్రి ఏర్పడిరదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఉదయం త్రయోదశి ఘడియలలో శని త్రయోదశి పూజలు ఆచరించడానికి, సాయంత్రం ప్రదోషకాల సమయంలో, అర్ధరాత్రి లింగోద్భవ కాల సమయంలో చతుర్దశి తిథి వ్యాప్తి ఉండడం చేత మాస శివరాత్రి ఆచరించుకోడానికి శివ పూజలు చేసుకోడానికి అనుకూలమయిన సమయమని చిలకమర్తి తెలిపారు.
ఇలా మాస శివరాత్రి రోజున చంద్రుడు మీనరాశిలో ఉండడం, మీన రాశిలోనే శని, రాహువులు, బుధుడు, శుక్రుడు మరియు చంద్రుడుతో కూడిన పంచగ్రహ కూటమి ఏర్పడడం చేత ఇది మహా శివ యోగముగా ఏర్పడిందని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఈ సమయములో చేసేటటువంటి శివారాధనకు విశేషమైన ఫలితం ఉంటుందని చిలకమర్తి తెలిపారు. ముఖ్యముగా ఏల్నాటిశని సంచరించు కుంభ, మీన, మేష రాశుల వారికి, శని ప్రభావం ఉన్న సింహ, ధను రాశుల వారికి శనివారం రోజు ఉదయం చేసే నవగ్రహ పూజలకి, శని పూజలకి, మరియు సాయంత్రం సమయంలో ఆచరించే శివారాధన, శివదర్శనాల వల్ల గ్రహ దోష నివృత్తి జరిగి శుభ ఫలితాలు పొందుతారని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంబంధిత కథనం