పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని కుదిపేసింది. ఈ దాడిలో ఏకంగా 28 మంది మరణించగా, 17 మందికి పైగా గాయపడ్డారు. దేశం మొత్తం ఈ దాడితో శోకసంద్రంలో మునిగిపోయిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు ఇది చోటు చేసుకుంది. ఈ దాడిలో పాక్ ప్రత్యక్ష ప్రమేయం ఉందని వారు అన్నారు. ఇది ఇలా ఉంటే పహల్గామ్లో ఉన్న దేవాలయాలకు సంబంధించి దేశ వ్యాప్తంగా వివిధ నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి.
పహల్గామ్లో ఉన్న ఆలయాల్లో మమల్ ఆలయం ఒకటి. దీనిని మమలేశ్వర ఆలయం అని అంటారు. ఈ ఆలయం పహల్గామ్లోని లిద్దర్ నది ఒడ్డున 2,200 మీటర్ల ఎత్తులో ఉంది. శివుడు గణేశుడు తలని శరీరం నుంచి వేరు చేసిన ఈ ప్రదేశమే ఆలయంగా మారింది.
ఓ రోజు పార్వతి దేవి వినాయకుడికి తాను స్నానం చేయడానికి వెళ్తున్నాని, ఎవరిని లోపలికి రానివ్వొద్దని చెప్పింది. పార్వతి దేవి ఆజ్ఞ మేరకు గణేశుడు అక్కడే కూర్చుని కాపలా ఉంటాడు. ఇప్పుడు ఇంతలో పరమేశ్వరుడు పార్వతి దేవిని కలవడానికి చేరుకుంటాడు. శివుడు లోపలికి వెళ్లడం మొదలుపెట్టాడు. కానీ అక్కడ ఉన్న గణేశుడు శివుడిని లోపలికి వెళ్ళనివ్వడానికి ఒప్పుకోలేదు.
ఒకసారి గణేషుడు లోపలికి వెళ్లొద్దని చెప్పాడు. అప్పుడు శివుడు పక్కకి తప్పుకోమని చెప్తాడు. కానీ వినాయకుడు వినడు. అడ్డుగా కూర్చుంటాడు. ఇది పార్వతి దేవి ఆజ్ఞ అని చెప్తాడు. అప్పుడు శివుడికి కోపం వచ్చి వినాయకుడి తలని నరికేస్తాడు. పార్వతి దేవి వస్తుంది.
అక్కడ జరిగిన దానిని చూసి ఆగ్రహం చెందుతుంది. శివుడితో జరిగిన విషయాన్ని చెప్తుంది. శివుడు బాధపడి పార్వతి దేవి చెప్పినట్లు గణేశుడిని మళ్ళీ పునరుద్ధరించమని కోరింది. తర్వాత శివుడు తన శరీరంపై ఏనుగు తలని ఉంచుతాడు. ఇలా గణేశుని పునరుద్ధరించాడు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.