చార్ధామ్ యాత్ర దేశంలోనే పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటి. చార్ధామ్ ని ఉత్తరాఖండ్లోని పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు. చార్ధామ్ దేవాలయాలు ఆరు నెలల పాటు తెరిచి ఉంటాయి. ఇతర సమయాల్లో వాటిని మూసి ఉంచుతారు. ఈ సంవత్సరం చార్ధామ్ యాత్ర ఏప్రిల్ 30న అక్షయ తృతీయ నాడు ప్రారంభమవుతుంది.
చార్ధామ్ లో నాలుగు దేవాలయాలు ఉన్నాయి. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. చార్ధామ్ తీర్థయాత్రలకు వెళ్లేవారు యమునోత్రి నుంచి ప్రయాణాన్ని ప్రారంభించాలని నమ్మకం. ఈ ప్రసిద్ధ నమ్మకం వెనుక కారణాలేంటి?, ఎందుకు అలా మొదలు పెట్టాలి వంటి వివరాలని ఇప్పుడే తెలుసుకుందాం.
యమునోత్రి ధామ్ యమునా యొక్క మూలం. మత విశ్వాసాల ప్రకారం యమునా యమరాజ్ సోదరి. భయాన్ని అధికమించడానికి సహాయపడుతుంది. పురాణాల ప్రకారం ఓ సారి యమరాజు తన సోదరీమణులను భాయ్దూజ్ నాడు కలవడానికి వెళ్ళాడు. యమరాజు తన సోదరీమణులను ఎవరైతే ఈ నదిలో స్నానం ఆచరిస్తారో వారి పాపాలు పోయి మోక్షం లభిస్తుందని దీవిస్తాడు.
అందుకని యమునా నదిలో స్నానం చేసిన తర్వాత మాత్రమే చార్ధామ్ సందర్శించడం శ్రేయస్కరమని అంటారు. ఎందుకంటే పాపాలని పోగొట్టుకోవడానికి సహాయపడుతుంది. అలా చేస్తే చార్ధామ్ యాత్రలో ఎటువంటి ఆటంకాలు ఉండవు అని నమ్మకం.
యమునోత్రి నుంచి ప్రయాణాన్ని ఎందుకు ప్రారంభించాలో ఇంకో కారణం కూడా ఉంది. యమునోత్రి ధామ్ పశ్చిమాన ఉంది. దీని తర్వాత ఇతర ధామ్లు వస్తాయి. అందుకనే చార్ధామ్ యాత్రను యమునోత్రి నుంచి మొదలు పెట్టాలని అంటారు.
అలాగే తీర్థయాత్రను చేపట్టేటప్పుడు పశ్చిమం నుంచి తూర్పు దాకా చేయాలనీ ఒక ప్రసిద్ధ మత విశ్వాసం. సవ్య దిశలో ప్రయాణాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. యమునా నదిలో స్నానం చేసిన తర్వాత బయలుదేరడానికి ఇది కూడా ఒక కారణం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.