Haripad Nagaraja Temple: సంతానం కోసం, సర్పదోష నివారణకు కేరళ హరిపాడ్ నాగరాజు దేవాలయం ఎంత ప్రసిద్ధి?-kerala haripad nagaraja temple greatness by visiting this sarpa dosham goes away and may live happily ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Haripad Nagaraja Temple: సంతానం కోసం, సర్పదోష నివారణకు కేరళ హరిపాడ్ నాగరాజు దేవాలయం ఎంత ప్రసిద్ధి?

Haripad Nagaraja Temple: సంతానం కోసం, సర్పదోష నివారణకు కేరళ హరిపాడ్ నాగరాజు దేవాలయం ఎంత ప్రసిద్ధి?

Peddinti Sravya HT Telugu
Published Feb 18, 2025 03:01 PM IST

Nagaraja Temple: కేరళలోని హరిపాడ్ నాగరాజు ఆలయాన్ని సందర్శించడం వల్ల సంతానం కలగడంతో పాటు సర్పదోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. (రచన: హెచ్ సతీష్, జ్యోతిష్కుడు)

Nagaraja Temple: సంతాన భాగ్యాన్ని ప్రసాదించే హరిపాడ్ నాగరాజ ఆలయం
Nagaraja Temple: సంతాన భాగ్యాన్ని ప్రసాదించే హరిపాడ్ నాగరాజ ఆలయం

భారతదేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. మన భారత దేశంలో పురాతన చరిత్ర కలిగిన ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి. చాలా మంది విశిష్టత కలిగిన ఆలయాలకు, ప్రత్యేకమైన ఆలయాలకి నిత్యం వెళ్తూ ఉంటారు. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా పురాతన ఆలయాలను, మహిమగల ఆలయాలని సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి ఒక విశిష్టత ఉంది.

ఇక్కడకు సంతానం కలగాలని అనుకునేవారు వస్తే, సంతాన భాగ్యం కలుగుతుంది. అలాగే సర్ప దోషం కూడా తొలగిపోతుందని నమ్మకం. మీకు కూడా ఈ ఆలయం గురించి తెలియదా? అయితే ఈ ఆలయానికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.

హరిపాడ్ నాగరాజ ఆలయం

కేరళలోని హరిపాడ్ లో నాగరాజ ఆలయం ఉంది. ఈ ఆలయం మహిమను ఇప్పుడే తెలుసుకుందాం. ఈ నాగరాజ ఆలయాన్ని సందర్శిస్తే సంతానం కలుగుతుంది. సర్ప దోషం తొలగిపోతుందని భక్తుల విశ్వాసం. సర్ప దోషం ఉన్నా, సంతాన సమస్యలు వున్నా.. వాటి నుంచి బయటపడడానికి భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఈ ఆలయం మన్నరసాల నాగరాజ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఎక్కువ మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. అంతర్జాతీయ స్థాయి పుణ్యక్షేత్రం ఇది.

పుట్టుకతో వచ్చే లోపాలు

పుట్టుకతో వచ్చే లోపాలు ఉన్నవారు ఇక్కడ పసుపుతో చేసిన ముద్దను ప్రసాదంగా తీసుకుంటే లోపాలు తొలగిపోతాయి. సంతానం కలగని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. అందుకే చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. భారతదేశంలో అతిపెద్ద దేవాలయాల్లో ఇది ఒకటి.

పరశురాముడు చేసిన పాపం

పరశురాముడు అనేక మంది క్షత్రియులను చంపుతాడు. కానీ ఆ పాపం నుండి విముక్తి పొందే మార్గం లేక ఋషి మునులను కలుస్తాడు. భూదానం చేయడం ద్వారా ఈ పాపం నుండి విముక్తి లభిస్తుందని ఋషి మునులు చెబుతారు. కొద్ది మొత్తంలో భూమిని ఇవ్వమని పరశురాముడు వరుణుడిని అడుగుతాడు.

అందుకు అనుగుణంగా వరుణుడు భూమిని పరశురామకు ఇస్తాడు. కఠోర తపస్సు చేసి పరశురామ శివుని నుండి శత్రు సంహారానికి కొడవలిని పొందుతాడు. శివుని ఆశీర్వాద ఫలితంగా లభించిన కొడవలిని సముద్రంలో విసురుతాడు. సముద్రం నుండి పొందిన భూమిని నియమాల ప్రకారం అర్హులకు దానం చేస్తాడు. ఈ ప్రాంతమే భారతదేశంలోని కేరళ.

అప్పుడు కేరళ అత్యంత విషపూరిత పాములతో నిండి ఉంది. ఈ విషపూరిత పాముల నుండి రక్షణ పొందడానికి అక్కడ నాగపూజను ప్రారంభించారు. నాగరాజును ప్రసన్నం చేసుకోవడానికి పరశురాముడు స్వయంగా తన శిష్యులతో కలిసి నిర్జన అడవిలోకి ప్రవేశిస్తాడు. చివరకు అందరూ కేరళ దక్షిణ భాగాన్ని చేరుకుంటారు. అది పెద్ద సముద్ర తీరంగా ఉంటుంది. తన తపస్సుకు ఇది సరైన ప్రదేశం అని అందరిలోనూ భావన కలుగుతుంది. ఆ తరువాత పరశురాముడు తన తపస్సుకు తీర్థక్షేత్రాన్ని నిర్మిస్తాడు.

పరశురాముడి భీకర తపస్సుకు సంతోషిస్తూ నాగదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నాగ దేవుని శక్తిని గ్రహించిన పరశురాముడు నాగదేవుని పాదాలకు నమస్కరించి తన లక్ష్యాన్ని నెరవేర్చమని ప్రార్థించాడు. ఆ రోజు నుండి నాగ దేవుడు ఈ ప్రాంతాన్ని రక్షించాడని నమ్ముతారు.

ఇంకో కథ

వాసుదేవుడికి, శ్రీదేవికి సంతానం కలగలేదు.పెద్దల ఆదేశం మేరకు వారు నాగదేవుడిని పూజిస్తారు.ఆకస్మిక ఇబ్బందుల్లో ఉన్న పాములపై వాసుదేవుడు, శ్రీదేవి తేనె, నూనె కలిపిన నెయ్యిని పోస్తారు. పాముల శరీరాలను గంధపు పూతతో చల్లుతారు. పంచగవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఈ కారణంగా నాగదేవుడు అక్కడకు వచ్చి పూజలు చేసే దంపతులకు జన్మనిస్తాడని నమ్ముతారు. నేటికీ, ఇలా జరిగే అద్భుతాలు దేవునిపై నమ్మకాన్ని పెంచుతాయి.

Peddinti Sravya

eMail
Whats_app_banner

సంబంధిత కథనం