Lakshmi devi: పూజ గదిలో ఈ 2 విగ్రహాలు ఉంచితే వెంటనే ఇంట్లోని దరిద్రం తొలగిపోతుంది.. సంపద పెరిగి సంతోషంగా ఉండొచ్చు-keep these 2 idols for lakshmi devi blessings wealth will increase and can stay with happiness so follow these remedies ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lakshmi Devi: పూజ గదిలో ఈ 2 విగ్రహాలు ఉంచితే వెంటనే ఇంట్లోని దరిద్రం తొలగిపోతుంది.. సంపద పెరిగి సంతోషంగా ఉండొచ్చు

Lakshmi devi: పూజ గదిలో ఈ 2 విగ్రహాలు ఉంచితే వెంటనే ఇంట్లోని దరిద్రం తొలగిపోతుంది.. సంపద పెరిగి సంతోషంగా ఉండొచ్చు

Peddinti Sravya HT Telugu
Feb 03, 2025 01:30 PM IST

Lakshmi devi: మీరు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలనుకుంటున్నారా? ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇవి కచ్చితంగా గుర్తు పెట్టుకోండి.

Lakshmi devi: పూజ గదిలో ఈ 2 విగ్రహాలు ఉంచితే వెంటనే ఇంట్లోని దరిద్రం తొలగిపోతుంది
Lakshmi devi: పూజ గదిలో ఈ 2 విగ్రహాలు ఉంచితే వెంటనే ఇంట్లోని దరిద్రం తొలగిపోతుంది (pinterest)

చాలా మంది అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇబ్బందులు నుంచి బయటపడడానికి వాస్తు ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. అయితే, కొన్ని వాస్తు చిట్కాలని పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. ప్రతికూల శక్తి తొలగిపోతుంది. చాలా.మంది ఆర్థిక ఇబ్బందులతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.

సంబంధిత ఫోటోలు

దాని వలన మానసికంగా సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో నుంచి సంతోషం వెళ్లిపోతుంది. కొంతమందికైతే ఇంట్లోకి డబ్బు వచ్చిన వెంటనే అది వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఒక్క రూపాయి కూడా మిగలదు.

ఆర్థిక సమస్యల్లో కూరుకుపోవాల్సి ఉంటుంది. మీరు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడాలనుకుంటున్నారా? ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇవి కచ్చితంగా గుర్తు పెట్టుకోండి.

ఈ రెండు విగ్రహాలు మీ ఇంట్లో ఉంటే ఇబ్బందులే ఉండవు

లక్ష్మీదేవి, కుబేరుడు

జ్యోతిష్యం ప్రకారం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి, కుబేరుడు విగ్రహాలు పూజ గదిలో ఉండడం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రెండు ఇంట్లో పూజగదిలో ఉండడం వలన ఆర్థిక సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు. సంతోషాన్ని పొందవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రెండు విగ్రహాలు ఇంట్లో ఉంటే డబ్బుకి కొరత ఉండదు. పేదరికం నుంచి బయటపడొచ్చు.

వాస్తు ప్రకారం కుబేరుడు, సంపదనిచ్చే లక్ష్మీ ఆశీర్వాదంతో పేదరికాన్ని తొలగించుకోవచ్చు. ఇంట్లో ఎక్కడ చూసినా శ్రేయస్సు ఉంటుంది. దీంతో పాటు ఇంట్లో కుటుంబ సభ్యులందరి ఆదాయం పెరుగుతుంది. డబ్బుకి సంబంధించిన ఇబ్బందుల నుంచి గట్టెక్కొచ్చు.

వీటిని గుర్తుపెట్టుకోండి

  1. జ్యోతిష్యం ప్రకారం ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇల్లు శుభ్రంగా లేకపోతే చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
  2. ముఖ్యంగా పూజ స్థలం చుట్టూ మురికి లేకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవి అక్కడ నివాసము ఉంటుంది. లక్ష్మీదేవి మురికిని ద్వేషిస్తుంది.
  3. కాలానుగుణంగా మురికిని శుభ్రం చెయ్యని ఇళ్లలో పేదరికం వ్యాప్తి చెందుతుంది. సానుకూల శక్తి తొలగిపోతుంది. కాబట్టి వీటిని గుర్తు పెట్టుకొని ఆచరించినట్లయితే మీ ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆర్థిక బాధలు ఉండవు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం