జగన్నాథ రథయాత్ర 2025: జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు!-jagannath rath yatra 2025 do know these 10 interesting things about rath yatra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  జగన్నాథ రథయాత్ర 2025: జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు!

జగన్నాథ రథయాత్ర 2025: జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు!

Peddinti Sravya HT Telugu

పూరీ రథయాత్ర గురించి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అందులో ఎలాంటి వివక్ష లేదు. ఏ మతమైనా, కులమైనా, దేశమైనా ఎవరైనా రథాన్ని లాగవచ్చు. ఈ ఆలయం శ్రీకృష్ణుని జగన్నాథ రూపానికి అంకితం చేయబడింది. జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు తెలుసుకోండి.

జగన్నాథ రథయాత్ర 2025

ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్ర ఆషాఢ మాసం శుక్లపక్షం రెండవ రోజున ప్రారంభమవుతుంది. ఈ ఏడాది రథయాత్ర నేటి నుంచి అంటే జూన్ 27న ప్రారంభం అయ్యింది. ఒరిస్సాలోని పూరీ జగన్నాథ ఆలయం దాని వైభవానికి, మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ది చెందింది. ఈ ఆలయం శ్రీకృష్ణుని జగన్నాథ రూపానికి అంకితం చేయబడింది, ఇక్కడ అతని అన్నయ్య బలభద్ర, సోదరి సుభద్రను కలిసి పూజిస్తారు.

జగన్నాథ రథయాత్రలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. ఈ రోజున, జగన్నాథుడు, అతని అన్నయ్య, సోదరి మూడు పెద్ద రథాలపై తన అత్తవారి ఇంటి అయిన గుండిచా ఆలయానికి వెళతారు. జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు ఇక్కడ ఉన్నాయి.

జగన్నాథ రథయాత్ర గురించి తెలుసుకోవలసిన 10 విషయాలు:

జగన్నాథుని రథయాత్ర వెనుక ఒక పౌరాణిక కథ ఉంది. జగన్నాథుడిని శ్రీకృష్ణుని రూపంగా భావిస్తారు. శ్రీకృష్ణుడు చనిపోయినప్పుడు ఆయన చితాభస్మాన్ని సముద్రంలో నిమజ్జనం చేశారు. అదే సమయంలో ఒడిషా రాజు సముద్రం ఉన్న పవిత్రమైన కలపను చూసి, దానిని దేవుడిగా ప్రతిష్ఠించాలని కలలు కన్నాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు ఆ కలపతో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాన్ని తయారుచేశాడు.

దేవశిల్పి విశ్వకర్మ స్వయంగా భగవంతుని విగ్రహాన్ని తయారు చేయడానికి వచ్చాడని అంటారు. చీకటి గదిలో విగ్రహాలు తయారు చేస్తానని విశ్వకర్మ రాజు ముందు షరతు పెట్టాడు. విగ్రహం నిర్మించే వరకు ఎవరూ లోపలికి రాకూడని చెప్తాడు. రాజు ఈ షరతును అంగీకరించాడు. ఒక రోజు రాజు ఆ గది లోపలి నుండి ఎటువంటి శబ్దం వినపడకపోవడంతో లోపలికి వెళ్ళాడు.

అప్పటి నుంచి స్వామివారి విగ్రహాలు అసంపూర్తిగా ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న విగ్రహాలను రాజు ఆలయంలో ప్రతిష్టించాడు. జగన్నాథుడు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి తన జన్మస్థలమైన మజురాను సందర్శిస్తారని అప్పట్లో ప్రవచించారు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు ఆషాఢ శుక్ల ద్వైతి రోజున స్వామిని తన జన్మస్థలానికి వెళ్ళేలా ఏర్పాట్లు చేశాడు. అప్పటి నుంచి రథయాత్ర సంప్రదాయం కొనసాగుతోంది.

  1. రథయాత్ర కోసం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి కోసం మూడు వేర్వేరు రథాలను తయారు చేస్తారు. రథయాత్రలో బలరాం గారి రథం ముందు వరుసలో, మధ్యలో సుభద్ర దేవి రథం, వెనుక జగన్నాథుని రథం ఉంటాయి.
  2. బలరాముడి రథాన్ని తలధ్వజుడు అంటారు. దీని రంగు ఎరుపు, ఆకుపచ్చ. సుభద్ర దేవి రథాన్ని దర్పాదలన్ లేదా పద్మ రథం అంటారు. దీని రంగు నలుపు లేదా నీలం మరియు ఎరుపు. జగన్నాథుని రథాన్ని నందిఘష్ లేదా గరుడధ్వజ అని పిలుస్తారు. దీని రంగు ఎరుపు, పసుపు.
  3. జగన్నాథుని నందిఘోష రథం ఎత్తు 45.6 అడుగులు, బలరాముడి తలధ్వజ్ ఎత్తు 45 అడుగులు, సుభద్రాదేవి దర్పడలన్ రథం ఎత్తు 44.6 అడుగులు.
  4. భగవంతుని రథాలు పవిత్రమైన మరియు పరిపక్వమైన వేపతో తయారు చేయబడతాయి, దీనిని దారు అని పిలుస్తారు. రథాల నిర్మాణానికి ఆరోగ్యకరమైన, పవిత్రమైన వేప చెట్టును గుర్తించి, ఇందుకోసం ఆలయం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.
  5. రథాల నిర్మాణానికి కావాల్సిన కలపను వసంత పంచమి నుండి ఎంపిక చేయడం ప్రారంభమవుతుంది. వాటి నిర్మాణం అక్షయ తృతీయ నుండి ప్రారంభమవుతుంది.
  6. రథయాత్ర కోసం మూడు రథాల నిర్మాణం పూర్తయిన తరువాత, ఛార్ పహన్రా అనే ఆచారం నిర్వహిస్తారు. ఇందుకోసం పూరీ గజపతి రాజు పల్లకిలో వచ్చి మూడు రథాలను పూజలతో పూజిస్తారు. 'బంగారు చీపురు'తో మండపాన్ని, మార్గాన్ని శుభ్రపరుస్తాయి.
  7. రథయాత్ర జగన్నాథ ఆలయం నుండి ప్రారంభమై మూడు రథాలు గుండిచా ఆలయానికి చేరుతాయి. ఇది దేవుని అత్తగారి ఇల్లు. ఇక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి ఏడు రోజులు విశ్రాంతి తీసుకుంటారు. ఇక్కడే శిల్పి విశ్వకర్మ ముగ్గురు దేవతల విగ్రహాలను తయారు చేశాడని ప్రతీతి.
  8. ఆషాఢ మాసం శుక్లపక్షంలో రథయాత్ర జరుగుతుంది, ఆ సమయంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఇప్పటి వరకు రథయాత్రలో వర్షం పడకపోవడం లేదు.
  9. ఆషాఢ మాసం పదవ రోజున మూడు రథాలు తిరిగి ఆలయం వైపు బయలుదేరుతాయి. రథాల తిరుగు ప్రయాణాన్ని బహుదా యాత్ర అంటారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి ఆలయానికి తిరిగి వచ్చిన తర్వాత కూడా విగ్రహాలన్నీ రథంలోనే ఉంటాయి. మరుసటి రోజు ఏకాదశి నాడు ఆలయ ద్వారాలు తెరుస్తారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.