గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశికి మారుతూ ఉంటాయి. ఈ మార్పు వలన 12 రాశులపై ప్రభావం పడుతుంది. కొన్ని కొన్ని సార్లు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి. మే నెలలో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది.
రాహువు, కేతువు, గురువు రాశుల మార్పు ఉంది. రాహువు మీనం నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కేతువు కన్యా రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు మిధున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు, సూర్యుడు, శుక్రుడు రాశులు మారుతారు.
మేష రాశి వారికి ఈ సమయంలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే అనవసరమైన గొడవలు ఎదురయ్యే అవకాశం ఉంది.
వృశ్చిక రాశి వారు ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లోన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కొన్ని సార్లు ఎదురయ్యే పరిస్థితులు వల్ల చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.
సింహ రాశి వారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనవసరమైన గొడవలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.
ధనస్సు రాశి వారికి కూడా మే నెలలో కొన్ని గ్రహాల మార్పుల వలన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి.
మీన రాశి వారు కూడా ఈ గ్రహాల మార్పు సమయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. అలా చేయడం వలన ఎంతో నష్టం కలిగే అవకాశం ఉంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.