Good luck: మనం చేసే కొన్ని చిన్న పనులు మనకు అదృష్టాన్ని తీసుకొస్తాయి. మన తలరాతను మారుస్తాయి. జీవితాన్ని మారచేస్తాయి. హిందూ మతంలో దాతృత్వం, అనేక ఆచారాలు సానుకూల శక్తులను ఆహ్వానిస్తాయని జీవితంలో పెద్ద మార్పులు తీసుకొస్తాయని నమ్ముతారు. మీ జీవితాన్ని మార్చడంలో సహాయపడే ఆరు ముఖ్యమైన పనులు ఉన్నాయి. వీటిని పాటించడం వల్ల అదృష్టం లభిస్తుంది. మీ తలరాత మారుతుంది.
హిందువులు గోమాతను పవిత్రతకు ప్రతిరూపంగా భావిస్తారు. సార్వత్రిక మాతృత్వానికి చిహ్నంగా చూస్తారు. ఆవులకు బెల్లం తినిపిస్తే అది మీ తలరాతను మార్చేందుకు సహాయపడుతుందని చెబుతారు. ఇది దాతృత్వ చర్యగా పరిగణిస్తారు. క్రమం తప్పకుండా ఈ పని చేయడం వల్ల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆవులు తమ పాలతో సమస్త ప్రాణులను పోషించినట్టు వాటికి బెల్లం తినిపించడం వాటికి మనం ఆహారం అందించడం. ఇలా చేయడం వల్ల పాపాలు తొలగుతాయి, దోషాలు నశిస్తాయి.
సంస్కృతంలోనే ప్రసిద్ధ మంత్రం
కారాగ్రే వసతే లక్ష్మి, కర్మధ్యే సరస్వతి.
కరమూలే తు గోవిందం, ప్రభాతే కరదర్శనం
నిద్రలేచిన తర్వాత మొదట మీ చేతులను చూడమని ఈ మంత్రం వివరిస్తుంది. సంపద దేవతగా భావించే లక్ష్మీదేవి అరచేతుల్లో నివసిస్తుందని దీని అర్థం. సృజనాత్మకత, తెలివితేటలు, జ్ఞానాన్ని సూచించే సరస్వతీదేవి చేతికి దిగువ భాగంలో నివసిస్తుందని చెప్తారు. అలాగే శ్రీకృష్ణుడు కూడా మన చేతుల్లో ఉంటాడని అందుకే నిద్ర లేచిన వెంటనే అరచేతులు చూసుకోవాలని చెబుతారు.
తులసి మొక్కను హిందూమతంలో అత్యంత పవిత్రమైనదిగా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది చాలా ముఖ్యమైనది. తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వల్ల పరిసరాలు శుద్ధి అవుతాయని, దైవానుగ్రహం లభిస్తుందని నమ్మకం. దీపం నుంచి వచ్చే కాంతి చీకటిని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. జ్ఞానానికి మార్గాన్ని చూపిస్తుంది. నెయ్యి స్వచ్ఛమైన పదార్థాలలో ఒకటి. ఇంటి చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక శక్తులను మెరుగుపరుస్తుంది. నెయ్యి దీపాన్ని వెలిగించడం వల్ల సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇంటికి శ్రేయస్సును తీసుకొస్తుంది.
ఉదయాన్నే పూజ సమయంలో శంఖం ఊదడం మతపరంగా అనుసరించే ముఖ్యమైన ఆచారం. శంఖం వల్ల వచ్చే శబ్దం శుభప్రదంగా ప్రకటిస్తారు. ఇల్లు శుద్ధి అవడటంతో పాటు ఏదైనా ప్రతికూల శక్తులు దుష్టశక్తులు తొలగిస్తుందని నమ్ముతారు. దీని నుంచి వచ్చే శబ్దం పర్యావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఇంటి చుట్టూ రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది.
మనం ఆచరించాల్సిన మరొక ఆచారం ఏదైనా వంట చేసినప్పుడు ఆహారం వండినప్పుడు మొదటగా దేవునికి సమర్పించాలి. మనం తినే పదార్థంలో దేవుడికి మొదటి ముద్ద పెట్టడం లేదంటే ఆహార పదార్థాలలో కొంత దేవుడికి తీయడం వల్ల దేవుని ఆశీర్వాదాలు లభిస్తాయి. దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పడానికి ఇదొక మార్గంగా పరిగణిస్తారు. అలాగే ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకూడదు.
పూజలో ముఖ్యమైన వస్తువు కర్పూరం. దీని నుంచి వచ్చే సువాసన పరిసరాలను శుద్ధి చేస్తుందని నమ్ముతారు. అందుకే కర్పూరం వెలిగించి ఇంటి చుట్టూ ధూపం వేయడం వల్ల ఇంట్లోని వాతావరణం శుభ్రపడుతుంది. మీ ఎదుగుదలకు ఆటంకం కలిగించే శక్తులు దూరం అవుతాయి. దీని ఘాటైన వాసన, పొగ వల్ల పరిసరాలు శుద్ధి అవుతాయి. ఇంటికి రక్షణగా ఉంటుంది.