శని గ్రహ దోషం అనేది జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహం దుష్ప్రభావం వలన కలిగే సమస్యలని సూచిస్తుంది. ఈ దోషం సమయంలో అనేక శారీరక, ఆర్థిక, మానసిక ఇబ్బందులు కలగవచ్చు. శని దోషాన్ని శాంతిపర్చడానికి కొన్ని నియమాలు పాటించడం, శని దేవునికి ప్రీతికరమైన స్తోత్రాలు పఠించడం మేలు చేస్తుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
గోచార రీత్యా శని గ్రహ దోషం ఉన్న వారు ఈ క్రింది చెప్పిన శాంతులు చేసిన చికాకులు, ఆటంకాలు తొలగి శనీశ్వరుని అనుగ్రహం పొందుతారు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
1. శనిగ్రహ దోషంతో ఇబ్బంది పడుతున్న వారు ప్రతినిత్యం మృత్యుంజయ మహామంత్రం పఠిస్తే మంచిది.
మృత్యుంజయమంత్రం: ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుక మివ బంధనా నృ్మత్యో ర్ముక్షీయ మామృతాత్
2. శనివారం రోజున శివునకు అభిషేకం, నవగ్రహాలలో శనిగ్రహానికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేయిస్తే మంచిది.
3. మందపల్లెలో శనీశ్వరునికి శనివారం లేదా శని త్రయోదశి నాడు అభిషేకం చేయిస్తే మంచిది.
4. ఈ క్రింది మంత్రములను మీ పూజా మందిరములో ప్రతి రోజు లేదా శనివారం నాడు 19 సార్లు పఠించవలెను.
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం క్లీం ఐం సౌః హీం శనైశ్చరాయ నమః, ఓం హ్రీం నమః పంగుపాదాయ సూర్యసూనవే నమః, ఓం అం హ్రీం క్రోం వం వం క్లీం క్లీం మద్రరూషాయ శనైశ్చరాయ రం మమ దుఃఖ దారిద్ర్య బాధా నాశనాయ, శ్రాం హ్రీం క్షేమం కురు కురు స్వాహా
5. ప్రతీ రోజు శివాలయమును దర్శించి, నవగ్రహాలకు 19 ప్రదక్షణలు చేస్తే మంచిదని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు..
6. శనివారం నాడు బ్రాహ్మణునకు 1 1/4 కేజీ నువ్వులు దానం చేస్తే మంచిది.
7.ప్రతి శనివారం ఆవపిండి కలిపిన పెరుగు అన్నాన్ని గోవుకు పెడితే మంచిది.
8. శనివారం నాడు శివాలయములోని నవగ్రహాలలో శని గ్రహమునకు నల్ల ఉమైత్త పూలు, విష్ణుక్రాంత పుష్పములతో అష్టోత్తర పూజ జరిపిస్తే మంచిది.
9. ఇంద్రనీలము, నీలమణి రత్నాన్ని కుడిచేతికి ధరిస్తే దోషాలు తొలగిపోతాయి.
10.ప్రతి రోజు శనిస్తోత్రములను పారాయణ చేస్తే సమస్యలు తీరిపోవచ్చు.
11. నల్లని ద్రాక్షపండ్లను, నల్లని లేదా నీలి వస్త్రాన్ని దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణునికి దానం చేస్తే మంచిది.
12. శని గాయత్రి మంత్రాన్ని పూజా మందిరంలో ప్రతి రోజు 19 సార్లు పఠిస్తే మంచిది.
శని గాయత్రి : రవిపుత్రాయ విద్మహే యమాగ్రజాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్
13. ఆలయంలో ఉన్న నవగ్రహాలలో శని గ్రహం వద్ద 19 వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే దోషాలు తొలగిపోతాయి.
14.ఒక శనివారం మీ ఇంట్లో శనిహోమం జరిపిస్తే శని బాధల నుంచి బయట పడవచ్చు.
15.ఏడు శనివారముల వ్రతం చేసుకుంటే ఈతి బాధలు వుండవు.
16. ప్రతిరోజు శ్రీ వేంకటేశ్వరస్వామి స్తోత్రములను పఠిస్తే మంచిదని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు..
17. దగ్గరలో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రతిరోజు దర్శించుకుంటే మంచిది.
18. శని సింగణాపూర్ ని దర్శించి 1 1/4 కేజి నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయిస్తే మంచిది.
19. పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర నక్షత్రములు ఉన్నరోజున నల్లనువ్వులు, నీలివస్త్రం,బ్రాహ్మణునికి దానం చేయవలెను.
20. నలమహారాజు చరిత్ర, సుందరకాండ, వేంకటేశ్వర మహత్యం పారాయణ చేస్తే కూడా శని దోషాలు తొలగిపోతాయి.
21. మీకు అనుకూలమైన (కుదిరిన) అయ్యప్ప దీక్షను స్వీకరించవలెను.
22. శ్రీ వేంకటేశ్వరస్వామివారికి తలనీలాలు సమర్పించి, దర్శనం చేసుకుంటే ఈ బాధలు వుండవు.
23. శనివారం రోజున నువ్వుల ఉండను కాకులకు పెట్టినా శని బాధల నుంచి బయట పడచ్చని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.