గరుడ పురాణం ప్రకారం భార్యాభర్తల విషయంలో ఈ తప్పు చేస్తే.. చనిపోయాక ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా?-garuda puranam says if someone do this mistake regarding wife husband then they must face this punishment after death ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  గరుడ పురాణం ప్రకారం భార్యాభర్తల విషయంలో ఈ తప్పు చేస్తే.. చనిపోయాక ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా?

గరుడ పురాణం ప్రకారం భార్యాభర్తల విషయంలో ఈ తప్పు చేస్తే.. చనిపోయాక ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా?

Peddinti Sravya HT Telugu

భార్యాభర్తల పవిత్ర బంధానికి భంగం కలిగించడం, లేదంటే వారి గోప్యత, సాన్నిహిత్యానికి భంగం కలిగించడం పాపమని గరుడ పురాణంలో చెప్పబడింది. గరుడ పురాణం ప్రకారం భార్యాభర్తల విషయంలో ఈ తప్పు చేస్తే, చనిపోయాక ఎంత పెద్ద శిక్ష పడుతుందో తెలుసా?

గరుడ పురాణం (pinterest)

హిందూమతంలో ముఖ్యమైన గ్రంథాలలో గరుడ పురాణం ఒకటి. ఇది మరణాంతర స్థితిని వివరించడమే కాదు, మతం, నైతికత, జీవితంలో ప్రవర్తనకి సంబంధించిన విషయాలనూ చెప్తుంది. భార్యాభర్తల పవిత్ర బంధానికి భంగం కలిగించడం, లేదంటే వారి గోప్య సాన్నిహిత్యానికి భంగం కలిగించడం పాపమని గరుడ పురాణంలో చెప్పబడింది.

ఇది ఎందుకు పాపం?

గరుడ పురాణం ప్రకారం, ఒక భార్యాభర్తల లేదా ప్రియుడు-ప్రేయసి మధ్య వ్యక్తిగత సంబంధంలో జోక్యం చేసుకోవడం, వారి ప్రైవేట్ క్షణాలు గురించి ఇతరులకు చెప్పడం, వీడియోలు తీయడం లాంటివి అధర్మంగా పరిగణించబడతాయి. ఇలా చేసే వ్యక్తి నరకానికి వెళ్తాడు. ఇది ఉల్లంఘన పాపం కిందకు వస్తుంది.

ఇలాంటి వారికి ఏ శిక్ష పడుతుంది?

ఇటువంటి వ్యక్తి మరణం తర్వాత తామస్రా లేదా అంధతామస్రా అనే నరకానికి పంపబడతాడు. తామస్రా, అంధతామస్రా నరకాలలో ఆత్మ చీకటి, హింస కలిగే చోట ఉంచబడుతుంది. అక్కడ మోసం, ద్రోహం, గోప్యత ఉల్లంఘన ఫలితంగా హింసించబడతారు.

నీచ జన్మలో

ఇతరులు వైవాహిక జీవితంలో జోక్యం చేసుకున్నట్లయితే తదుపరి జన్మలో నీచ జన్మలో పుడతారని గరుడ పురాణంలో చెప్పబడింది. పురాణం ప్రకారం, భార్యాభర్తల జీవితం చాలా పవిత్రమైనది, గౌరవించబడినది, నమ్మకంతో కూడి ఉన్నది.

కాబట్టి వారి గోప్యతను ఉల్లంఘించడం సామాజిక నేరం మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా కర్మల ఆధారంగా ఘోరమైన పాపం కూడా. దీనితో మరణం తర్వాత తీవ్రమైన నరక హింస రూపంలో అనుభవించాల్సి ఉంటుంది. కనుక ఇతరుల వివాహ సంబంధాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.