దేవుడు మనకు ఇచ్చిన దాంట్లో ఎంతో కొంత దానం చేయడం చాలా పుణ్యాన్ని ఇస్తుంది. దాతృత్వం చేయాలనే గుణం చాలా మంచిది. హిందూ మతం, సనాతన సంప్రదాయాలలో దాతృత్వం ముఖ్యమైన భాగం. దేవుళ్ళకే కాదు అవసరంలో ఉన్న వారికి సహాయం అందించడం వల్ల పుణ్యం సంపాదించుకున్నట్టు అవుతుంది.
దానం చేయడం వల్ల ఒక వ్యక్తి అదృష్టం మారిపోతుంది. ఆత్మను శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. సానుకూల శక్తిని అందిస్తుంది. ఒక మనిషి చనిపోయినప్పుడు తన వెంట తీసుకెళ్లడానికి అంటూ ఏమి ఉండదు. కేవలం మనం చేసే మంచి పనుల పుణ్యం మాత్రమే వెంట వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మీ కష్టాలను రూపుమార్చి అదృష్టాన్ని ప్రసాదించే ఈ పనులు చేయడం వల్ల జీవితం మారిపోతుంది.
గోమాతకు హిందూ మతంలో పవిత్రమైన స్థానం ఉంది. గోమాతకు పచ్చి మేత తినిపించడం మంచిది. అలాగే గోశాలలో బెల్లం దానం చేయడం లేదంటే మీరే గోవులకు స్వయంగా బెల్లం తినిపించడం చాలా పుణ్యకార్యం. దేవుడి దృష్టిలో పుణ్యాన్ని సంపాదిస్తుంది. ఆవుకు ఆరహం ఇవ్వడం వల్ల జీవితంలో శాంతి నెలకొంటుంది. పనుల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే అవి తొలగిపోతాయి.
హనుమంతుడి ఆలయంలో అగ్గిపెట్టెను దానం చేయడం చాలా మంచి విషయం. మీపై ఏదైనా చెడు, ప్రతికూలతలు ఉన్నట్టుగా అనిపిస్తే మీరు మంగళవారం నాడు హనుమాన్ దేవాలయంలో అగ్గిపెట్టె విరాళంగా ఇవ్వవచ్చు. జీవితానికి సరైన వెలుగు, మార్గం చూపించమని హనుమంతుడిని వేడుకుంటూ ఈ పని చేస్తారు. మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించమని అడిగేందుకు ఇదొక మార్గంగా భావిస్తారు.
అన్నదానం చేసే సంస్థలకు ఉప్పు విరాళంగా ఇవ్వడం మంచిది. లేదంటే ఆలయానికి ఇవ్వవచ్చు. ఆర్థిక పురోగతిలో ఏవైనా అడ్డంకులు ఏర్పడుతుంటే మీరు ఉప్పును దానం చేయవచ్చు. ఇలా చేస్తే మీ అడ్డంకులు తొలగిపోయేందుకు సహాయపడుతుంది. ఉప్పును దానం చేయడం ద్వారా మెరుగైన ఆర్థిక, సంపద ఉత్పత్తి ఉంటుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది.
మీ తలరాతను మార్చడంలో సహాయపడే మరొక దానం చాపలు దానం చేయడం. ఆలయాల్లో పూజలు, భజనలు చేసేందుకు పూజారులు, భక్తుల కోసం చాపలు దానం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల జీవితం మంచి స్థితిలో ఉంటుంది. ప్రార్థనలు చేసుకునేందుకు వచ్చే వారికి సౌకర్యవంతంగా ఉండటం కోసం దానం చేసే చాపలు మీ అదృష్టాన్ని మారుస్తాయి. శాంతి, ప్రశాంతతను అందిస్తాయి. దైవం ఆశీర్వాదాలు లభిస్తాయి.
తులసి మొక్క దగ్గర ప్రతి రోజు నెయ్యి దీపం వెలిగించే సంప్రదాయం అందరూ పాటిస్తారు. తులసి స్వచ్చత, భక్తికి చిహ్నంగా నమ్ముతారు. అదృష్టాన్ని, ఆయుష్హును ఇవ్వమని కోరుకుంటూ రోజూ దీపం వెలిగిస్తారు. నెయ్యి దీపాలను దానం చేయడం వల్ల సంపద పెరుగుతుంది. అజ్ఞానాన్ని తొలగించడంలో సహాయపడుతుంది.
దేవాలయాలలో దేవుళ్ళకు, దేవతలకు చాలా మంది బంగారం లేదా వెండితో చేసిన గొడుగు విరాళంగా ఇస్తారు. ఇది దేవుళ్ళను గౌరవించడంగా భావిస్తారు. బంగారం, వెండి వంటి వాటితో చేసిన వాటిని విరాళంగా ఇవ్వలేని వాళ్ళు పూలతో చేసిన గొడుగు ఇవ్వచ్చు. ఇలాంటివి దానం చేయడం వల్ల జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి. ఛత్రం సమర్పించడం అనేది దైవిక రక్షణను పొందటానికి ఉపయోగపడుతుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్