పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలోనే ఈ 7 ప్రదేశాల్లో కూడా రథయాత్రను జరుపుతారని తెలుసా?-do you know in these 7 places ratha yatra will be held just like puri ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలోనే ఈ 7 ప్రదేశాల్లో కూడా రథయాత్రను జరుపుతారని తెలుసా?

పూరీ జగన్నాథ రథయాత్ర తరహాలోనే ఈ 7 ప్రదేశాల్లో కూడా రథయాత్రను జరుపుతారని తెలుసా?

Peddinti Sravya HT Telugu

ప్రతి ఏటా ఆషాడ మాసంలో పూరీ జగన్నాథుని భక్తులు రథయాత్రకు పెద్ద సంఖ్యలో వెళతారు. ఎంతో భక్తి, శ్రద్ధలతో రథయాత్రను వీక్షిస్తారు. పూరీతో పాటు చాలా చోట్ల రథయాత్రను నిర్వహిస్తారు. మరి పూరిలోనే కాకుండా రథయాత్రను ఇంకా ఎక్కడెక్కడ నిర్వహిస్తారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

పూరీ జగన్నాథ రథయాత్ర (pinterest)

పూరీలో రథయాత్ర చేస్తారన్న విషయం మనకు తెలుసు. ప్రతి ఏటా ఆషాడ మాసంలో పూరీ జగన్నాథుని భక్తులు రథయాత్రకు పెద్ద సంఖ్యలో వెళతారు. ఎంతో భక్తి, శ్రద్ధలతో రథయాత్రను వీక్షిస్తారు. ఈ రథయాత్రను చూడడానికి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు. అయితే, పూరీలో రథయాత్ర జరుగుతుందన్న విషయం మనకు తెలుసు.

కానీ పూరీతో పాటు చాలా చోట్ల రథయాత్రను నిర్వహిస్తారు. మరి పూరిలోనే కాకుండా రథయాత్రను ఇంకా ఎక్కడెక్కడ నిర్వహిస్తారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

పూరీలో రథయాత్ర ఎప్పుడు?

ఏడాది జగన్నాథ రథయాత్ర జూన్ 27 నుంచి మొదలవుతుంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు పూరీ క్షేత్రంలో ఈ రథయాత్రను నిర్వహిస్తారు. ఆషాడమాసం శుక్లపక్షం రెండవ రోజు నుంచి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. కృష్ణ భక్తులు విదేశాల నుంచి కూడా వస్తారు. అయితే, పూరీతో పాటు మరికొన్ని చోట్ల కూడా ఈ రథయాత్ర జరుగుతుంది. ఆ ప్రదేశాలు ఏవో ఇప్పుడే తెలుసుకుందాం:

1.రాంచీ

పూరీలో రథయాత్ర జరిపినట్లే రాంచీలో కూడా జరుపుతారు. రథయాత్రను చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఇక్కడ జగన్నాథుడు రథంలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేస్తాడు. డప్పులు, సన్నాయి, వాయిద్యాలతో రథయాత్రను ఘనంగా జరుపుతారు.

2.హైదరాబాద్

హైదరాబాదులో కూడా పూరీ తరహాలోనే పాదయాత్రను జరుపుతారు. బంజారాహిల్స్‌లో ఉన్న జగన్నాథ ఆలయంలో కూడా ఈ సంప్రదాయం ఉంది. జగన్నాథుడు, సుభద్రా దేవి, బలభద్రుడు మూడు రథాల్లో ఉంటారు. రథాలను అందంగా అలంకరించి ఊరేగిస్తారు.

3.మధ్యప్రదేశ్

భోపాల్ నగరంలో కూడా ఈ రథయాత్రను ఘనంగా జరుపుతారు. ఇక్కడకి కూడా భారీగా భక్తులు వస్తారు. ఈ రథయాత్రను వైభవంగా జరుపుతారు.

4.కాశీ

కాశీలో కూడా జగన్నాథుని రథయాత్రను నిర్వహిస్తారు. ఇక్కడికి కూడా చాలామంది భక్తులు తరలివస్తారు. ఘనంగా జరిపే ఈ రథయాత్రకు దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తారు.

5.కాన్పూర్

ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌లో కూడా రథయాత్రను ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ జగన్నాథుడు రథంలో ఊరేగుతూ ఉంటే భక్తుల సంతోషానికి అవధులే ఉండవు.

6.బృందావనం

బృందావనంలో కూడా పూరీ మాదిరిగా రథయాత్రను నిర్వహిస్తారు. చాలామంది భక్తులు ఇక్కడ రథయాత్రకు వెళ్తారు. భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడికి రథయాత్రను చూడడానికి వస్తారు.

7.ఢిల్లీ

ఢిల్లీలో జగన్నాథ ఆలయంలో కూడా రథయాత్రను నిర్వహిస్తారు. హౌజ్ కాస్ట్‌లో ఉన్న ఈ ఆలయం, జగన్నాథుని రథయాత్రను నిర్వహించే సాంప్రదాయం కలిగి ఉంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.