రోమహర్షణుడు మునులకు పద్దెనిమిది పురాణాలను గురించి వివరంగా తెలియజేశాడు అని ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు. మొదట్లో ఒకే పురాణం ఉండేది. ఆ పురాణాన్ని వేదవ్యాసుడు పద్దెనిమిది మహాపురాణాలుగా విభజించాడు అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేశారు. మహాపురాణాలలో నాలుగు లక్షల శ్లోకాలు ఉన్నాయి.
ఈ పురాణాన్ని బ్రహ్మ మరీచి మహామునికి చెప్పాడు. దీనిలో పదమూడు వేల శ్లోకాలున్నాయి. దీనిని ఎవరికయైనా పౌర్ణమినాడు ఇవ్వాలి. అదీ వైశాఖ మాసంలో అలా ఇచ్చినందువల్ల చాలా పుణ్యం వస్తుంది. ఈ పురాణమును "ఆది పురాణము" లేక "సూర్య పురాణము" అని కూడా అంటారు. ఈ పురాణాన్ని బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతికి బోధించాడు. ఇందులో శ్రీకృష్ణ, కశ్యప, మార్కండేయుల చరిత్రలు, వర్ణాశ్రమ ధర్మాలు, ధర్మాధర్మ వివరాలు, స్వర్గ నరకాల వర్ణనలు విపులంగా చెప్పబడ్డాయి. ఇందులో 10,000 శ్లోకాలున్నాయి.
దీనిలో ఎనభై ఐదు వేల శ్లోకాలున్నాయి. దీనిని జ్యేష్ఠ మాసంలో ఎవరికయైనా ఇవ్వాలి. అష్టాదశ పురాణాలలో అతి పెద్ద పురాణము ఈ పద్మపురాణము. ఈ పురాణాన్ని వింటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ఈ పురాణం పద్మకల్పంలో జరిగిన విశేషాలను తెలుపుతుంది. ఇందులో మధుకైటభుల వధ, బ్రహ్మసృష్టి కార్యము, గీతార్థసారము, గంగా మహాత్మ్యము, పద్మగంధి దివ్యగాథ, గాయత్రీ చరిత్రము, అశ్వత్థ వృక్ష మహిమ, విభూతి మహాత్మ్యం, దైవపూజా విధి విధానాలు వివరంగా చెప్పబడ్డాయి.
దీనిని పరాశరుడు చెప్పాడు. దీనిలో ఇరవై మూడు వేల శ్లోకాలున్నాయి. దీనిని ఆషాఢ మాసంలో దానం చేయాలి. ఇందులో విష్ణు మహత్యము, ప్రహ్లాద, ధృవ, భరతుల చరిత్రలు చెప్పబడ్డాయి. ఇందులో 23,000 శ్లోకాలున్నాయి.
దీనిలో ఇరవై నాలుగు వేల శ్లోకాలున్నాయి. మొదటగా వాయుదేవుడు దీనిని చెప్పాడు. ఇందులో శివదేవుని వైభవము, కాలమానము, భూగోళ, ఖగోళ వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
దీనిలో పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి. భాద్రపద మాసంలో పౌర్ణమినాడు రాత్రి దీనిని దానం చేయాలి. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతార చరిత్రలను, శ్రీకృష్ణుని బాల్య లీలా వినోదాలను ఈ పురాణం పన్నెండు స్కంథాలలో వివరిస్తుంది. ఇందులో 18,000 శ్లోకాలున్నాయి.
దీనిని మొదటగా నారదుడు చెప్పాడు. దీనిలో ఇరవై ఐదు వేల శ్లోకాలున్నాయి. ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజున దీనిని దానం ఇవ్వాలి. ఈ పురాణాన్ని నారదుడు బ్రహ్మ మానసపుత్రులయిన సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులకు చెప్పాడు. ఇందులో అతి ప్రసిద్ధమైన వేదపాదస్తవము (శివస్తోత్రము), వ్రతములు, బదరీ, ప్రయాగ, వారణాసి క్షేత్రముల వర్ణనలు ఉన్నాయి.
దీనిలో తొమ్మిది వేల శ్లోకాలున్నాయి. దీనిని మార్గశిర మాసంలో దానం చేస్తే చాలా పుణ్యం వస్తుంది.
దీనిని మొదటగా అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి చెప్పాడు. దీనిలో పదహారు వేల శ్లోకాలున్నాయి. దీనిని కూడా మార్గశీర్ష మాసంలోనే ఇవ్వాలి. ఇందులో శివ, గణేశ, దుర్గా ఉపాసనలు, వ్యాకరణం, ఛందస్సు, వైద్యం, రాజకీయములు, భూగోళ, ఖగోళ, జ్యోతిష శాస్త్రములు చెప్పబడ్డాయి. ఇందులో 15,400 శ్లోకాలున్నాయి.
దీనిని మొదటగా బ్రహ్మదేవుడు చెప్పాడు. దీనిలో పద్నాలుగు వేల ఐదువందల శ్లోకాలున్నాయి. భవిష్యత్తులో జరిగే విషయాలను గురించి ఈ పురాణం తెలియజేస్తుంది. పుష్య మాసంలో పౌర్ణమి నాడు దీనిని దానం చేయాలి. సూర్యోపాసన విధి, అగ్నిదేవతా ఆరాధన విధి, వర్ణాశ్రమ ధర్మాలు ఈ పురాణంలో వివరించబడ్డాయి. ముఖ్యంగా ఈ పురాణం రాబోయే కాలంలో జరుగబోయే విషయాలను గురించి తెలుపుతుంది.
దీనిని నారద మహర్షికి సావర్ణి మనువు మొదటగా చెప్పాడు. దీనిలో పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి. మాఘ మాసంలో పౌర్ణమినాడు దీనిని దానం చేయాలి. గణేశ, స్కంద, రుద్ర, శ్రీకృష్ణుల చరిత్రలు, సృష్టికి కారణమైన భౌతిక జగత్తు (ప్రకృతి) వివరములు, దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి, రాధ మొదలైన పంచశక్తుల మహిమలు ఈ పురాణంలో వివరించబడ్డాయి.
శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు. ఇందులో కార్తికేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు, మానవులు ఆచరించదగిన ధర్మాలు, వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మాహాత్మ్యాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి.
బ్రహ్మదేవునిచే మరీచికి చెప్పబడింది. ఇందులో రాధా-కృష్ణుల, పరశురామ, శ్రీరామచంద్రుల చరిత్రలు, శ్రీలలితా సహస్రనామ స్తోత్రాలు, శివ, విష్ణు స్తోత్రాలు, గాంధర్వ, ఖగోళ శాస్త్ర వివరాలు, స్వర్గ నరకాల వర్ణనలు చెప్పబడ్డాయి. ఇందులో 12,000 శ్లోకాలు ఉన్నాయి.
శ్రీమహావిష్ణువు వరాహ అవతారము దాల్చినప్పుడు ఈ పురాణాన్ని భూదేవికి చెప్పాడు. ఇందులో శ్రీశ్రీనివాసుని చరిత్రము, వేంకటాచల వైభవము, విష్ణుమూర్తి ఉపాసనా విధానము, పరమేశ్వరి, పరమేశ్వరుల చరిత్రలు, వ్రతకల్పములు, పుణ్యక్షేత్ర వర్ణనలు ఉన్నాయి. ఇందులో 24,000 శ్లోకాలు కలవు.
ఈ పురాణాన్ని పులస్త్య ప్రజాపతి నారద మహర్షికి బోధించాడు. ఇందులో శివలింగ ఉపాసన, శివ పార్వతుల కల్యాణము, గణేశ, కార్తికేయుల చరిత్రలు, భూగోళ, ఋతు వర్ణనలు ఉన్నాయి. ఇందులో 10,000 శ్లోకాలు ఉన్నాయి అని ప్రముఖ ఆధ్యాత్మికవేత, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలియజేసారు.
ఈ పురాణము కుమారస్వామిచే (స్కందుడు) చెప్పబడింది. ఇందులో శివచరిత్ర, స్కందుని మహాత్మ్యము, ప్రదోష స్తోత్రములు, కాశీ ఖండము, కేదార ఖండము, సత్యనారాయణ వ్రతమును తెలిపే రేవా ఖండము, వేంకటాచల క్షేత్రాన్ని తెలిపే వైష్ణవ ఖండము, జగన్నాథ క్షేత్రాన్ని తెలిపే ఉత్కళ ఖండము, అరుణాచల క్షేత్రాన్ని తెలిపే కుమారికా ఖండము, రామేశ్వర క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మ ఖండము, గోకర్ణ క్షేత్రాన్ని తెలిపే బ్రహ్మోత్తర ఖండము, క్షిప్రానది, మహాకాల మహాత్మ్యాన్ని తెలిపే అవంతికా ఖండము ఉన్నాయి. ఇందులో 81,000 శ్లోకాలు ఉన్నాయి.
ఇందులో శివుని ఉపదేశములు, లింగరూప శివుని మహిమలు, దేవాలయ ఆరాధనలతో పాటు వ్రతములు ఉన్నాయి అని చిలకమర్తి తెలియజేసారు.
ఈ పురాణాన్ని శ్రీమహావిష్ణువు గరుత్మంతునకు చెప్పాడు. ఇందులో జీవి జనన, మరణ వివరములు, మరణించిన తర్వాత జీవి యొక్క స్వర్గ, నరక ప్రయాణములు, దశ మహాదానముల వివరాలు, నరకంలో పాపులు అనుభవించే శిక్షలు గురించి చెప్పబడ్డాయి. ఇందులో 19,000 శ్లోకాలు ఉన్నాయి.
కూర్మావతారం ఎత్తిన శ్రీమహావిష్ణువు ఈ పురాణాన్ని చెప్పాడు. ఇందులో వరాహ, నారసింహ అవతార వివరణ, లింగరూప శివ ఆరాధన, అనేక పుణ్యక్షేత్రముల వివరములు ఉన్నాయి. ఇందులో 17,000 శ్లోకాలు ఉన్నాయి అని చిలకమర్తి తెలియజేసారు.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ- 9494981000