ప్రతీ సంవత్సరం వైశాఖ శుక్లపక్ష తదియ నాడు అక్షయ తృతీయని జరుపుకుంటాము. ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 30న వచ్చింది. ఈరోజు కొన్ని పరిహారాలని పాటించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి, సంతోషంగా ఉండవచ్చు. డబ్బుకు లోటు కూడా ఉండదు. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి చాలా మంది వివిధ పరిహారాలని పాటిస్తారు.
ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. ఈ చిన్న పరిహారాన్ని పాటించడం వలన లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు కలిగి సుఖ సంపదలతో సంతోషంగా ఉండవచ్చు. అక్షయ తృతీయ రోజు రాత్రి ఏ పరిహారాన్ని పాటించాలి, లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా కలుగుతుంది వంటి వివరాలను తెలుసుకుందాం.
చీపురుని మనం లక్ష్మీదేవిగా భావిస్తాము. చీపురికి సంబంధించి ఈ పరిహారాన్ని పాటిస్తే ఇంట్లో ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. చీపురు పేదరికం, కలహాలు లాంటి సమస్యలను తొలగిస్తుంది. చీపురు అనారోగ్య సమస్యల్ని, దుఃఖం నుంచి కూడా బయటపడేస్తుంది. అక్షయ తృతీయ నాడు చీపురు పరిహారాన్ని పాటిస్తే అదృష్టం ప్రకాశిస్తుంది. డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.
అక్షయ తృతీయ నాడు ఒక వెండి కాసు లేదా రూపాయి కాసు తీసుకుని గంగాజలంతో శుద్ధి చేసి లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించాలి. ఆ తరవాత రాత్రి చీపురు కింద ఈ వెండి కాసుని ఉంచండి. రాత్రి నిద్రపోయే ముందు మాత్రమే ఇలా చేయండి. ఆ తరవాత రోజు ఈ కాసుని బీరువాలో లేదా డబ్బులు దాచే చోటు పెట్టండి. ఇలా లక్ష్మీదేవితో సమానమైన చీపురు కింద ఇలా ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులకు లోటు ఉండదు.
అక్షయ తృతీయ నాడు చీపురుని కొనడం మంచిది. పాత చీపురుని తొలగించి కొత్త చీపురుని ఈరోజు నుంచి ఉపయోగిస్తే మంచిది.
చీపురుని మేడపైన లేదంటే ఓపెన్ గా ఉండే చోట ఉంచకూడదు. అలా ఉంచడం వలన సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఎప్పుడూ కూడా వాయువ్యం వైపు ఉంచడం మంచిది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.