కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ పురాణాల్లో ప్రాముఖ్యత ఎక్కువ. ఈ రోజున చేసే వ్రతాలు, పూజలను దేవతలు స్వయంగా స్వీకరిస్తారని భావిస్తారు. దేవతలందరినీ ఇబ్బంది పెడుతున్న త్రిపురాసురుడు అనే రాక్షసుడిని కార్తీక పౌర్ణమి రోజున సంహరిస్తడు. త్రిపురాసురిడి పీడ విరగడైందన్న సంతోషంతో దేవతలంతా కలిసి దీపాలు వెలిగించి పండగ చేసుకుంటారు. దీన్నే దేవ్ దీపావళి లేదా దేవతల దీపావళి అని పిలుస్తారు. అప్పటి నుంచి ప్రతి కార్తీక పౌర్ణమికి దీపాలు వెలిగించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సాారి 15 నవంబర్ 2024 శుక్రవారం రోజున కార్తీక పౌర్ణమి వచ్చింది.
పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి రోజున దీపావళి జరుపుకునేందుకు దేవతలందరూ కాశీకి వస్తారు. ఈ పండగను వారణాసీలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు దీపాలు వెలిగించడం, గంగలో విడిచిపెట్టడం శుభప్రదమని అగ్ని పురాణం చెబుతుంది. కనుక చాలా మంది భక్తులు పౌర్ణమి రోజు 365 వత్తులతో దీపం వెలిగించి దేవుళ్లను ఆరాధిస్తరు. కార్తీక పౌర్ణమి రోజున పవిత్ర గంగా స్నానాలకు కూడా ప్రాముఖ్యత ఎక్కువ.
కార్తీక పౌర్ణమి రోజున లక్ష్మీదేవి పూజకు కూడా విశిష్టత ఎక్కువ. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి పూర్ణిమ అత్యంత అనుకూలమైనదిగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి అత్యంత సంతోషంగా ఉంటుందనీ, ఆమెను భక్తి శ్రద్దలతో పూజించి ప్రసస్నం చేసుకుంటే భక్తులు కోరుకున్న వరాలను ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు కొన్ని పరిహారాలను చేయడం వల్ల లక్ష్మీ దేవి మెచ్చి భక్తుల ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుటుంది. కార్తీక పూర్ణిమ నాడు చేయవలసిన పరిహారాలేంటో తెలుసుకోండి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.