Diwali 2024: దీపావళి రోజు ఇవి పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకండి- దురదృష్టం వెంటాడుతుంది-do not give these things to anyone before and after diwali lakshmi pujan ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Diwali 2024: దీపావళి రోజు ఇవి పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకండి- దురదృష్టం వెంటాడుతుంది

Diwali 2024: దీపావళి రోజు ఇవి పొరపాటున కూడా ఎవరికీ ఇవ్వకండి- దురదృష్టం వెంటాడుతుంది

Gunti Soundarya HT Telugu

Diwali 2024: ఆనందాల దీపావళి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇల్లు మొత్తం దీపాలతో అలంకరించి సంతోషంగా బాణాసంచా కాలుస్తారు. ఈరోజు లక్ష్మీపూజ విశేషమైనది. అయితే లక్ష్మీపూజకు ముందు లేదా తర్వాత అయిన కొన్ని వస్తువులు పొరపాటున కూడా ఎవరికీ దానం చేయకూడదు.

దీపావళి రోజు ఇవి ఎవరికీ ఇవ్వకండి (PTI)

దీపావళి రోజున లక్ష్మీ దేవి ఆగమనం, స్వాగతం కోసం ప్రజలు నెలల ముందుగానే సిద్ధం చేయడం ప్రారంభిస్తారు. ఇళ్లను శుభ్రపరిచిన తర్వాత అమావాస్య రోజున లక్ష్మీ దేవిని, గణేశుడిని పూజిస్తారు. ఈసారి దీపావళి తేదీపై గందరగోళం నెలకొంది.

క్యాలెండర్‌లో వ్యత్యాసం కారణంగా కొందరు అక్టోబర్ 31న దీపావళిని జరుపుకుంటున్నారు. మరికొందరు నవంబర్ 1న దీపావళిని జరుపుకుంటున్నారు. అక్టోబర్ 31న అమావాస్య తిథిలో ప్రదోషకాలం వస్తుంది. ఈ రోజు సాయంత్రం పూజ తర్వాత, ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. 

దీపావళి పూజ సమయం 

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 6.12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పూజకు శుభ సమయం ఉంది. మొత్తంగా పూజకు రెండు గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో లక్ష్మీపూజ చేస్తే అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయి. ఈసారి దీపావళి పూజ వృషభ రాశి లగ్నంలో ఉంటుంది. 

వృషభ లగ్నంలో మంగళకర్మ, గృహ ప్రవేశం, గ్రహ సంబంధ పనులు, వ్యాపారం, వాహన కొనుగోలు సంబంధించిన పనులు ఎప్పుడు విజయవంతం అవుతాయి. అందుకే వృషభ లగ్నంలో పూజ అత్యంత విశిష్టమైనదని పండితులు సూచిస్తున్నారు.  

ఇవి దానం చేయకండి 

దీపావళి రోజున సాయంత్రం పూట పాలు, పెరుగు, వాటితో చేసిన వస్తువులు ఎవరికీ ఇవ్వకూడదు. ఈ రోజున పాలు, పెరుగు, వాటితో చేసిన వస్తువులు ఇవ్వడం వల్ల ఇంటికి ఐశ్వర్యం, శ్రేయస్సు ఉండబోదని చెబుతారు. దీపావళి తర్వాత కూడా సాయంత్రం పూట పాలు దానం చేయకూడదు.

ఉప్పు 

దీపావళి రోజున ఉప్పు ఎవరికీ దానం చేయకూడదు. జ్యోతిష్యం ప్రకారం ఉప్పు శుక్ర గ్రహానికి, చంద్రునికి సంబంధించినది. అందుకే దీపావళి రోజున ఉప్పును ఇవ్వకూడదు. ఇది సంపద గ్రహమైన శుక్రుడిని బలహీనపరుస్తుంది. 

పసుపు 

పసుపుతో అలంకరణ లేకుండా ఏ కార్యక్రమం ఉండదు. పసుపును శుభ కార్యాలలో ఉపయోగిస్తారు. ఇది బృహస్పతికి సంబంధించినది. అందువల్ల ఈ రోజున పసుపును దానం చేయడం వలన మన జీవితంలో సంపదకు కారకంగా పరిగణించబడే బృహస్పతి బలహీనమవుతాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

చక్కెర

దీపావళి నాడు సాయంత్రం పూట పంచదార దానం చేయకూడదు. ఈ రోజు పంచదారను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వత నివాసం ఉండదని అంటారు. వాస్తవానికి చక్కెర చెరకుతో తయారు చేయబడుతుంది. చెరకు లక్ష్మీదేవికి ప్రీతికరమైనదని చెబుతారు. అందుకే దానితో తయారు చేసిన చక్కెరను ఈరోజు పొరపాటున కూడా దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల దురదృష్టం వెంటాడుతుంది. 

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.