ప్రతీ ఒక్కరు కూడా వారి రోజు బావుండాలని నిద్ర లేస్తూ దేవుడికి దండం పెట్టుకుని రోజును మొదలుపెడతారు. అయినప్పటికే కొన్ని కొన్ని సార్లు మన రోజులో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలా రకాల సమస్యలు కలుగుతాయి. రోజంతా సంతోషంగా ఉండాలన్నా, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి.
మన సనాతన ధర్మంలో, జ్యోతిష్యంలో కూడా శుభ ఫలితాలను ఇచ్చే వాటికోసం చెప్పడం జరిగింది. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం. అలా చేయడం వలన సంతోషంగా, ప్రశాంతంగా ఉండొచ్చు.
చాలా మంది నిద్ర లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటారు. కానీ ఈ అలవాటు మంచిది కాదు. జ్యోతిష్యం ప్రకారం లేవగానే అద్దం వైపు చూడకూడదు. ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి కలుగుతుంది. రాత్రి నిద్ర పోయినప్పుడు ఒంట్లో ఉన్నా శక్తి స్లో అయిపోతుంది. నిద్ర లేచి అదే ఎనర్జీతో మన ముఖాన్ని చూసుకోవడం వలన మనపై నమ్మకం తగ్గిపోతుంది. మానసిక బలహీనతకు కూడా కారణం అవుతుంది.
నిద్రలేవగానే చీపురు కట్ట చూడడం కూడా మంచిది కాదు. చీపురు కట్ట లక్ష్మీదేవితో సమానం. నిద్ర లేవగానే చీపురుని ముట్టుకోవడం మంచిది కాదు. ఇది సంపదకి సంబంధించినది. కాబట్టి నిద్ర లేవగానే అలా ముట్టుకోవడం ధనాన్ని అగౌరవపరిచినట్లు అవుతుంది. దీంతో ఆర్థిక ఇబ్బందులు కలగవచ్చు.
ఉదయం లేవగానే గొడవ పడడం లేదా ఏడవడం లాంటివి చూడకూడదు. అలా చేయడం వలన రోజంతా ప్రశాంతతతో ఉండదు, రోజంతా కూడా చికాకుగా ఉంటుంది.
ఉదయం లేవగానే మొబైల్ ఫోన్ ముట్టుకోవడం మంచిది కాదు. ఇది నెగటివ్ ఎనర్జీ తీసుకువస్తుంది. ఉదయం లేవగానే మొదటి అరగంట కూడా చాలా ముఖ్యమైనవి. ఆ సమయంలో ధ్యానం, పూజా, యోగా వంటి వాటి కోసం కేటాయించడం మంచిది.
తల విరబోసుకున్న వారిని చూడడం, అంట్ల గిన్నెలు, మురికి ఇల్లు ఉదయం లేవగానే చూడడం వలన రోజంతా చికాకుగా ఉంటుంది. సానుకూల శక్తి వ్యాపించకుండా ప్రతికూల శక్తి కలుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం