అపర ఏకాదశి 2025: అపర ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు ఉపవాసం, దానాలు గురించి తెలుసుకోండి!-apara ekadashi 2025 date time and also check benefits of fasting and donation ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అపర ఏకాదశి 2025: అపర ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు ఉపవాసం, దానాలు గురించి తెలుసుకోండి!

అపర ఏకాదశి 2025: అపర ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు ఉపవాసం, దానాలు గురించి తెలుసుకోండి!

Peddinti Sravya HT Telugu

అపర ఏకాదశి 2025: అపర ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ రోజున అన్నదానం చేస్తే చాలా మంచిది. అపర ఏకాదశి ఎప్పుడు వచ్చింది? తేదీ, సమయంతో పాటు ఉపవాసం, దానాలు గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోండి.

అపర ఏకాదశి 2025

వైశాఖ మాసంలో కృష్ణ పక్షం ఏకాదశి నాడు అపర ఏకాదశి జరుపుకుంటారు. ఈ ఏడాది మే 23న జరుపుకోనున్నారు. హిందూ క్యాలెండర్ ప్రకారం మే 23న వేకువజామున 1.12 గంటలకు ప్రారంభమై మే 23న ఉదయం 10.29 గంటలకు ముగుస్తుంది. మే 23న ఉదయ తిధి వస్తుంది కాబట్టి అపర ఏకాదశిని మే 23న జరుపుకుంటారు. అపర ఏకాదశి తరువాత నిర్జల ఏకాదశి వస్తుంది. అన్ని ఏకాదశులలో నిర్జల ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.

అపర ఏకాదశి ఉపవాసం వల్ల కలిగే ప్రయోజనాలు

ఈ రోజున ఉపవాసం ఉండటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ ఉపవాసాన్ని ఆచరించడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. దశమి రోజున ఏకాదశి పూర్తిగా లేకపోతే ఆ రోజు కాకుండా మరుసటి రోజు ఏకాదశి ఉపవాసం చేయాలి.

అపర ఏకాదశి నాడు ఏం దానం చేయాలి?

వైశాఖ మాసంలో ఏకాదశి కాబట్టి ఈ రోజున కూడా నీరు దానం చేయడం మంచిది, పుచ్చకాయ, పండ్లు ఈ రోజున దానం చేస్తే మంచిది. పేదలకు అన్నదానం చేస్తే కూడా ఎంతో పుణ్య ఫలితం ఉంటుంది. ఈ రోజున ఆహారం, నీటిని దానం చేయడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.

అపర ఏకాదశి నాడు ఏం తినాలి?

దశమి రోజున అపర ఏకాదశి ఉపవాసం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ దశమి రోజు రాత్రి నుంచి ఆహారం తీసుకోకండి. ఈ రోజున అన్నదానం చేస్తే చాలా మంచిది. చాలా మంది ఈ రోజు ఉప్పు కూడా తినరు. ఈ రోజు పండ్లు తినడం ఉత్తమం.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.