హిందూ మతంలో, అక్షయ తృతీయను అక్షయ ఫలప్రదంగా, పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షం మూడవ రోజున జరుపుకుంటారు. ఈ ఏడాది అక్షయ తృతీయ 2025 ఏప్రిల్ 30న వచ్చింది.
ఈ రోజున స్నానం చేయడం, దానం చేయడం, తపస్సు చేయడం, ఆరాధించడం వల్ల అంతులేని పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అక్షయ తృతీయను శుభ సమయంగా భావిస్తారు. ఈ రోజున, కొన్ని పరిహారాలను పాటిస్తే జీవితంలో ఆనంద, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
1. అక్షయ తృతీయ రోజున పవిత్ర నదిలో స్నానం చేయాలి. నదిలో స్నానం చేయడం సాధ్యం కాకపోతే ఇంట్లోని నీటిలో గంగాజలాన్ని కలిపి స్నానం చేయవచ్చు. ఆ తర్వాత విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్ముతారు.
2. అక్షయ తృతీయ రోజున నీడనిచ్చే చెట్లను నాటడం శుభప్రదంగా భావిస్తారు. హిందూమతం యొక్క నమ్మకాల ప్రకారం, ఈ చెట్లు సంవత్సరాల తరబడి పచ్చగా ఉంటాయి, వాటిని నాటిన వ్యక్తి జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి.
3. అక్షయ తృతీయ రోజున నీరు, ఫ్యాన్, గొడుగు, ఉప్పు, నెయ్యి, పుచ్చకాయ వంటి సీజనల్ పండ్లను దానం చేయడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. వీటిని దానం చేయడం వల్ల మంచి పుణ్యం లభిస్తుందని, ధన సంబంధ సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు.
4. అక్షయ తృతీయ రోజున రాగి పాత్రలో నీళ్లు పోసి ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జీవితం నుంచి పేదరికం తొలగిపోయి సంతోషంగా ఉండచ్చు.
5. అక్షయ తృతీయ రోజున సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం