ప్రతీ సంవత్సరం వైశాఖ శుక్లపక్షంలో వచ్చే తదియ నాడు అక్షయ తృతీయను జరుపుకుంటాము. ఈసారి ఏప్రిల్ 30 బుధవారం నాడు వచ్చింది. ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా మంచిదన్న విషయం మనకి తెలుసు. అంతేకాకుండా ఈరోజు దానధర్మాలు చేయడం వలన లక్ష్మీదేవి, విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. ఈసారి అక్షయ తృతీయ నాడు అనేక శుభయోగాలు కూడా ఏర్పడనున్నాయి.
వేదవ్యాస మహర్షిని విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. వ్యాసుడు అక్షయ తృతీయ నాడే మహాభారతాన్ని రచించారు. గంగ కూడా దివి నుంచి భువికి ఈరోజే వచ్చిందట. కుబేరుడు ఈరోజు లక్ష్మీదేవిని ఆరాధించి, ధనవంతుడు అయ్యాడు. ఈ పవిత్రమైన రోజునే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చీరని ప్రసాదించాడు.
ఈరోజు బంగారంతో పాటు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం వలన సంపద, శ్రేయస్సు కలుగుతాయి. అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేయలేని వారు వీటిని కొనుగోలు చేసినా ఐశ్వర్యవంతులు అవ్వచ్చు.
రాగి లేదా ఇత్తడి పాత్రను అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేయడం మంచిది. లక్ష్మీ మూలానికి సంబంధించినవి ఇవి. ఈరోజు ఏదైనా రాగి లేదా ఇత్తడి పాత్రని కొనుగోలు చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. వీటిని కొనుగోలు చేసిన తర్వాత వంట గదిలో పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.
పసుపు శంఖం సంపదకు చిహ్నంగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ నాడు పసుపు శంఖాన్ని కొనుగోలు చేస్తే సంపద పెరుగుతుంది. ఆకస్మిక ఖర్చులు తగ్గుతాయి. సంతోషంగా ఉండొచ్చు.
ఈరోజు పసుపు ఆవాలను కొనుగోలు చేయడం వలన సంపద పెరుగుతుంది. తిండికి కూడా లోటు ఉండదు. ఈ పసుపు అవ్వాలని వంటగదిలో పెట్టడం వలన కష్టాలు ఉండవు. ముఖ్యంగా ఆహార కొరత ఉండదు.
అక్షయ తృతీయ నాడు వెండి కాసు కొనుగోలు చేస్తే కూడా మంచి జరుగుతుంది. లక్ష్మీదేవి ఉన్న వెండి కాసుని కొనుగోలు చేయడం వలన అదృష్టం కలిసి వస్తుంది. సంపద పెరుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం