అక్షయ తృతీయ నాడు 4 రాజయోగాలు.. ఈ మూడు రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!-akshaya tritiya 2025 four rajayogas will form on this auspicious day and bring lots of benefits to these three rasis ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అక్షయ తృతీయ నాడు 4 రాజయోగాలు.. ఈ మూడు రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!

అక్షయ తృతీయ నాడు 4 రాజయోగాలు.. ఈ మూడు రాశులకు కనీవినీ ఎరుగని రీతిలో లాభాలు!

Peddinti Sravya HT Telugu

అక్షయ తృతీయ పర్వదినాన ఏర్పడే రాజయోగాలు అన్ని రాశులనూ ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. అయితే, కొన్ని రాశులకు ఆర్థికంగా మంచి ప్రగతి లభిస్తుందని చెబుతున్నారు. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం.

అక్షయ తృతీయ నాడు 4 రాజయోగాలు

హిందూ మత విధానాల ప్రకారం అక్షయ తృతీయ అత్యంత శుభకరమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ పర్వదినాన ఏ పని చేసినా రెట్టింపు ఫలితం లభిస్తుందని నమ్ముతారు. ఈ రోజు ఏదైనా కొన్నా అది మన దగ్గర పెరుగుతుందని చెబుతారు.

అక్షయ తృతీయ పవిత్ర దినాన లక్ష్మీదేవి మరియు కుబేరుడుని పూజించడం ద్వారా, బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేయడం ద్వారా శుభం కలుగుతుందని చెబుతారు. 2025 సంవత్సరంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 30న వస్తుంది.

మంగళ యోగాలు

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజు చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఆ రోజు మంగళ యోగాలు ఏర్పడతాయని చెబుతున్నారు. చతుర్గ్రహ యోగం, లక్ష్మీ నారాయణ యోగం, గజకేసరి యోగం, మాలవ్య యోగం వంటి నాలుగు యోగాలు ఏర్పడతాయి.

ఈ అక్షయ తృతీయ పర్వదినాన ఏర్పడే రాజయోగాలు అన్ని రాశులనూ ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. అయితే, కొన్ని రాశులకు ఆర్థికంగా మంచి ప్రగతి లభిస్తుందని చెబుతున్నారు. ఆ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం.

అక్షయ తృతీయ పర్వదినాన ఈ 3 రాశులకు ఊహించని లాభాలు

1.వృషభ రాశి

అక్షయ తృతీయ పర్వదినాన మీకు మంచి ప్రగతి లభిస్తుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవి, కుబేరుడు ఆశీర్వాదం మీకు పూర్తిగా లభిస్తుందని చెబుతున్నారు. ఈ రాశివారు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని, జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. ఉద్యోగపరంగా మీకు మంచి ప్రగతి ఉంటుందని అంచనా.

ఉన్నతాధికారులు ప్రోత్సాహం ఇస్తారని, ఉద్యోగ అవకాశాలు మీ వైపు వస్తాయని అంచనా. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. కొత్త పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయని చెబుతున్నారు.

2.మీన రాశి

అక్షయ తృతీయ పర్వదినాన మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. దీనివల్ల మీకు మంచి విజయ అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. ఎక్కువ కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయని చెబుతున్నారు

ఉద్యోగం లేనివారికి మంచి ఉద్యోగం లభిస్తుందని చెబుతున్నారు. నాయకత్వ లక్షణాలు మీలో పెరుగుతాయని చెబుతున్నారు. కుబేరుడు, లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో ప్రగతి లభిస్తుందని అంచనా. కోటీశ్వర యోగం లభిస్తుందని చెబుతున్నారు.

3.మిధున రాశి

అక్షయ తృతీయ పర్వదినాన మీకు అదృష్ట యోగం కలుగుతుందని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఉద్యోగంలో మంచి ప్రగతి ఉంటుందని చెబుతున్నారు. వ్యాపారంలో మీకు మంచి లాభం లభిస్తుందని చెబుతున్నారు. ఉద్యోగం లేనివారికి మంచి ఉద్యోగం లభిస్తుందని అంచనా.

ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పు ఉంటుందని చెబుతున్నారు. లక్ష్మీదేవి, కుబేరుడు ఆశీర్వాదం మీకు పూర్తిగా లభిస్తుందని చెబుతున్నారు. ధనవర్షం కురిసే యోగం మీకు లభిస్తుందని అంచనా. కోటీశ్వర అదృష్టం మీ వైపు వస్తుందని చెబుతున్నారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం