హిందూ క్యాలెండర్ ప్రకారం, అక్షయ తృతీయ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్షంలో మూడవ రోజున జరుపుకుంటారు. అక్షయ తృతీయ నాడు బుధవారంతో రోహిణి నక్షత్రం కలయిక చాలా పవిత్రమైనదిగా భావిస్తారు, ఇది ఈ సంవత్సరం ఏర్పడుతోంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 30 బుధవారం వచ్చింది.
హిందూ మతం యొక్క నమ్మకాల ప్రకారం, ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం, కొనుగులు చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున కొన్న బంగారం ఎప్పటికీ క్షీణించదని, ఎల్లప్పుడూ వృద్ధి ఉంటుందని నమ్ముతారు. అక్షయ తృతీయ రోజున రాశి ప్రకారం ఏం దానం చేయాలి, వేటిని కొనుగోలు చేయాలో తెలుసుకోండి.
మేష రాశి వారు అక్షయ తృతీయ నాడు బార్లీ మరియు ధాన్యాలను దానం చేస్తే శుభఫలితం ఉంటుంది. బంగారం కొనడం శుభప్రదం.
వృషభ రాశి వారు అక్షయ తృతీయ నాడు పండ్లు దానం చేయాలి. ఈరోజు బంగారం, వెండి కొనడం శుభప్రదం.
ఈ రాశి వారు అక్షయ తృతీయ నాడు11 లేదా 21 మంది బ్రాహ్మణులకు కీరదోసకాయ లేదా దోసకాయను దానం చేయాలి. వెండి కొనడం శుభదాయకం.
కర్కాటక రాశి వారు అక్షయ తృతీయ నాడు కొత్త బట్టలు లేదా పండ్లు దానం చేయాలి. బంగారం, వెండి కొనుగోలు శుభప్రదంగా భావిస్తారు.
సింహ రాశి వారు అక్షయ తృతీయ నాడు బ్రాహ్మణులకు లేదా నిరుపేదలకు ఆహారం ఇవ్వడం శుభ ఫలితాలను ఇస్తుంది. బంగారం కొనడం శుభప్రదం.
కన్యా రాశి వారు ఆలయంలో సీజనల్ పండ్లు, ఫ్యాన్ లేదా నీటిని దానం చేయడం శుభప్రదంగా. బంగారం కొంటే మంచిది.
ఈ రాశి వారు పాలు, పెరుగు వంటి తెల్లని వస్తువులను దానం చేయడం మంచిది. వెండి కొనడం శుభప్రదం.
వృశ్చిక రాశి వారు బ్రాహ్మణుడికి నీటి కుండ లేదా మిఠాయిలను దానం చేయడం శుభప్రదం. ఈ రోజున రాగి పాత్రల కోసం కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
ధనుస్సు రాశి వారు పేదలకు పండ్లను దానం చేయండి. బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేయడం శుభప్రదం.
మకర రాశి వారు బ్రాహ్మణులకు మిఠాయిలు దానం చేయడం, ఫర్నిచర్ కొనుగోలు చేయడం మంచిది.
కుంభ రాశి వారు ఈరోజు శనగలు దానం చేయండి మంచిది. బంగారం కొనుగోలు లాభదాయకం.
మీన రాశి వారు పసుపు మిఠాయిలను దానం చేయాలి. వాహనాలు, బంగారం కొనుగోలు చేయడం శుభదాయకం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం