జూన్ 15వ తేదీన సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తాడు. దీంతో ప్రత్యేకమైన త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. గురువు కూడా చాలా కాలం తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 12 ఏళ్ల తర్వాత మిథున రాశిలో ఈ యోగం ఏర్పడనుంది. సూర్యుడు బుధుని కలయికతో బుధాదిత్య యోగం కూడా ఏర్పడుతుంది.
బుధుడు సొంత రాశిలో ఉంటాడు కనుక భద్ర యోగం ఏర్పడుతుంది. అదే విధంగా, సూర్యుడు గురువు కలయిక ఆదిత్య యోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ శక్తివంతమైన యోగాల వలన కొన్ని రాశుల వారికి ప్రయోజనం కలుగుతుంది.
వృషభ రాశి రెండవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. దీంతో వృషభ రాశి వారికి అనేక లాభాలు అందుతాయి. ఈ సమయంలో వృషభ రాశి వారికి పూర్వికుల ఆస్తి లభించే అవకాశం ఉంది. శుభకార్యాలకు ధనాన్ని వెచ్చిస్తారు. మానసిక ప్రశాంతతను పొందుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన ధనం ఇప్పుడు వస్తుంది. మీరు మీ ప్రసంగాలతో ప్రజలను గెలుచుకుంటారు.
మిథున రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. మిథున రాశి వారికి త్రిగ్రాహి యోగం అనేక లాభాలను తీసుకువస్తుంది. కెరియర్లో సక్సెస్ను అందుకుంటారు. పూర్వికల నుంచి ఆస్తి లభిస్తుంది. నిర్ణయం తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు.
ఈ రాశి ఏడవ ఇంట్లో ఈ సంయోగం జరుగుతుంది. దీంతో వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. బిజినెస్లో కూడా భారీగా లాభాలు వస్తాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
ఈ రాశి వారికి త్రిగ్రాహి యోగం అనేక లాభాలని అందిస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు కెరియర్లో అనేక మార్పులు అనుభవిస్తారు. పిల్లల నుంచీ శుభవార్తలు వింటారు. మతపరమైన కార్యక్రమాల్లో ఆసక్తి పెరుగుతుంది. యాత్రలకు వెళ్తారు.
తులా రాశి వారికి ఈ యోగం అనేక లాభాలని అందిస్తుంది. తండ్రి సపోర్ట్ ఉంటుంది. పూర్తి అదృష్టం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వారికి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఈ రాశి వారు అనుకున్న వాటిని పూర్తి చేస్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.