ప్రతీ సంవత్సరం వైశాఖ శుక్ల తదియ నాడు అక్షయ తృతీయను జరుపుకుంటాము. అక్షయ తృతీయ లక్ష్మీదేవికి సంబంధించిన పండుగ. ఈరోజు లక్ష్మీదేవితో పాటుగా కుబేరుడుని కూడా ఆరాధిస్తారు. బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుందని, శుభప్రదం అని భావిస్తారు. ఈసారి అక్షయ తృతీయ నాడు రాహువు, శుక్రుడు, శని గ్రహాలు సంచార దశలో ఉన్నాయి. దీంతో మూడు రాశుల వారికి కలిసి వస్తుంది.
అదృష్టంతో పాటుగా అష్టైశ్వర్యాలు కూడా కలుపుతాయి. ఇది ఇలా ఉంటే అక్షయ తృతీయ నాడే వంద సంవత్సరాలు తర్వాత గజకేసరి రాజ యోగం, మాలవ్య రాజు యోగం ఏర్పడబోతున్నాయి.
ఇది అన్ని రాశులపై ప్రభావం చూపించినప్పటికీ కొన్ని రాశుల వారికి మాత్రం విపరీతమైన ఐశ్వర్యాన్ని తీసుకువస్తుంది. మరి మీ రాశి కూడా ఇందులో ఉందేమో చెక్ చేసుకోండి.
మిధున రాశి వారికి అక్షయ తృతీయ నాడు కలిసి వస్తుంది. అదృష్టం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్తగా ఇంకో చోట ఉద్యోగాన్ని పొందవచ్చు. అదృష్టం మీ వెంట ఉండడంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. డబ్బు కూడా అందుతుంది. తల్లిదండ్రులతో ఉన్న సంబంధాలు మెరుగుపడతాయి. ఇలా మిధున రాశి వారికి అక్షయ తృతీయ నాడు అనేక లాభాలు ఉంటాయి.
వంద సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ యోగాలు వృషభ రాశి వారికి కొన్ని ప్రయోజనాలను అందిస్తాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఇది ఈ రాశి వారికి శుభ సమయం. ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. డబ్బుని పొదుపు చేస్తే ఆర్థికంగా బావుంటుంది.
మీన రాశి వారికి ఈ శుభయోగాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. వీరి కలలు నెరవేరుతాయి. గతంలో ఎవరి వద్ద అయినా డబ్బు నిలిచిపోతే ఈ సమయంలో మీ చేతికి వస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగాల కోసం చూస్తున్న వారి కల నెరవేరుతుంది. కొత్త వాహనాన్ని కూడా ఈ రాశి వారు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలకు వెళ్తారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.