పుట్టిన ప్రతీ ఒక్కరు కూడా ఏదో ఒక రోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎవరూ కూడా ఈ భూమిపై శాశ్వతం కాదు. హిందువు గ్రంథాలలో మరణం మాత్రమే సత్యంగా పరిగణిస్తారు. అయినా చాలా మందికి తెలిసినా ఈ సత్యం నుంచి దూరంగా ఉంటారు. మరణానికి ముందు ఒక వ్యక్తికి ప్రత్యేక సంకేతాలు కనపడతాయి.
అది పురాణాల్లో చెప్పబడింది. మత్స్య పురాణం ప్రకారం చనిపోయే ముందు ఈ సంకేతాలు కనపడతాయి. మరి మత్స్య పురాణం ప్రకారం ఒక వ్యక్తి చనిపోయే ముందు కనపడే సంకేతాలు ఏంటి? చనిపోయే వ్యక్తి ఎటువంటి వాటిని చూస్తాడు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాయంత్రం పూట కోడి కూత వినడం మంచిది కాదు. ఇది చెడు సంకేతం. అలాంటి పరిస్థితుల్లో ప్రతిరోజు సాయంత్రం ఎవరైనా కోడి కూతని వింటున్నట్లయితే మరణం ఆసన్నమైందని అర్థం. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మత్స్య పురాణం ప్రకారం, రోజూ కూడా పావురం నెల రోజులు పాటు ఎవరైనా ఇంటికి వచ్చినట్లయితే, ఆ వ్యక్తి త్వరలో ఈ భూమిని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళి పోతారట. ఇటువంటి పరిస్థితుల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి.
మత్స్య పురాణం ప్రకారం గొడ్డలి, తుపాకీ మొదలైనవి ఇంట్లో ఉండి, వాటిపై మాంసం తినే పక్షులు కూర్చున్నట్లయితే కూడా త్వరలో మరణం సంభవిస్తుందని అర్థం.
పదేపదే ఒకరి తలుపు దగ్గర గుడ్లగూబ అరుస్తున్నట్లయితే చెడు సంకేతంగా పరిగణించాలి. మత్స్య పురాణం ప్రకారం ఆ ఇంటి యజమాని త్వరలో ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడని అర్థం.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం