అక్షయ తృతీయ నాడు 7 శుభ యోగాలు.. ఆ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి!-7 subha yogas on akshaya tritiya do these on that day for lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  అక్షయ తృతీయ నాడు 7 శుభ యోగాలు.. ఆ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి!

అక్షయ తృతీయ నాడు 7 శుభ యోగాలు.. ఆ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు కలుగుతాయి!

Peddinti Sravya HT Telugu

వైశాఖ మాసం శుక్లపక్ష తదియ నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ బుధవారం అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయ నాడు 7 రాజయోగాలు ఏర్పడనున్నాయి. అలాగే అక్షయ తృతీయ నాడు లక్ష్మీ దేవిని ఆరాధించడం మంచిది. ఈరోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఏం చేయాలి?

అక్షయ తృతీయ నాడు 7 రాజయోగాలు (pinterest)

ప్రతీ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్ష తదియ నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీ బుధవారం అక్షయ తృతీయ వచ్చింది. తదియ ఏప్రిల్ 29న సాయంత్రం 5.32 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 30న మధ్యాహ్నం 2.12 గంటలకు ముగుస్తుంది.

అందుకే ఉదయ తిధి ప్రకారం ఏప్రిల్ 30న జరుపుకుంటారు. ఈ రోజున శుభకార్యాలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవి ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున దానం చాలా ముఖ్యమైనది. పురాణాల ప్రకారం, ఈ రోజున చేసిన విరాళం ఎప్పుడూ వృధా కాదని నమ్ముతారు.

అక్షయ తృతీయ నాడు 7 రాజయోగాలు

ఈ రోజు ప్రత్యేక శుభ సమయం ఉదయం 06.15 నుండి మధ్యాహ్నం 12.30 వరకు ఉంటుంది. ఈ రోజున గజకేసరి రాజయోగం, రవియోగం, చతుర్గ్రహి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, శోభన యోగం, లక్ష్మీ నారాయణ రాజ యోగం ఏర్పడతాయి. ఈ అరుదైన సంఘటనలు ఆకస్మిక లాభాలు, ప్రమోషన్లను సృష్టిస్తున్నాయి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మంచిది.

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ పనులు చేయండి

  • ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు.
  • లక్ష్మీదేవి ప్రధాన ద్వారం నుంచి లోపలకు వస్తుంది. కాబట్టి ఈ ద్వారం వద్ద దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతుంది.

వీటిని ఇంటి నుంచి తొలగించడం మంచిది

  1. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి, శుభ ఫలితాలను పొందడానికి అక్షయ తృతీయ ముందే పూజ మందిరంలో ఉన్న విగ్రహాలలో పగిలినవి, విరిగిపోయినవి తొలగించడం మంచిది. ఇలా ఉన్నట్లయితే సానుకూల శక్తి తొలగిపోయి, ప్రతికూల శక్తి కలుగుతుంది. పైగా విరిగిపోయిన, పగిలిపోయిన విగ్రహాలని ఇంట్లో ఉంచడం మంచిది కాదు. నది లేదా చెరువులో వాటిని నిమజ్జనం చేయడం మంచిది. ఎప్పుడూ ఇంట్లో పూజ గదిలో శుభ్రమైన, సంపూర్ణ విగ్రహాలు ఉండేటట్టు చూసుకోవాలి.
  2. అక్షయ తృతీయకి ముందే ఇంట్లో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించాలి. పాడైపోయిన వస్తువులు, పనికిరాని వస్తువులను ఇంట్లో నుంచి తొలగించడం మంచిది. ఇటువంటివి వాస్తు దోషాలకి కారణమవుతాయి. శాంతి, ఆనందం ఉండవు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.

సంబంధిత కథనం