Telangana Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు - 8 జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు-yellow warning issued for several districts in telangana due to rising temperatures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telangana Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు - 8 జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు

Telangana Weather Updates : తెలంగాణలో భానుడి భగభగలు - 8 జిల్లాలకు 'ఎల్లో' హెచ్చరికలు

Published Mar 14, 2025 03:30 PM IST Maheshwaram Mahendra Chary
Published Mar 14, 2025 03:30 PM IST

  • Telangana Temperature Updates : తెలంగాణలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. వేసవి ఆరంభంలోనే ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది.  పలు జిల్లాల్లో అధికస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పలు జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి….
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో సూర్యుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది.  అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 దాటితే చాలు… ఎండ తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లలేకపోతున్నారు.

(1 / 7)

తెలంగాణలో సూర్యుడి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది.  అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 9 దాటితే చాలు… ఎండ తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లలేకపోతున్నారు.

(Photo Source @APSDMA Twitter)

ఈ ఏడాది ఫిబ్రవరి ఆరంభం నుంచే ఎండలు పెరిగాయి,  వేసవి ఆరంభంలోనే ఈస్థాయి ఎండలు ఉండటంతో… జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో అధికస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

(2 / 7)

ఈ ఏడాది ఫిబ్రవరి ఆరంభం నుంచే ఎండలు పెరిగాయి,  వేసవి ఆరంభంలోనే ఈస్థాయి ఎండలు ఉండటంతో… జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో అధికస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 

(Photo Source @APSDMA Twitter)

తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. రేపు(మార్చి 15) పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 

(3 / 7)

తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసింది. రేపు(మార్చి 15) పలు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 

(PTI)

శనివారం(మార్చి 15) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.  

(4 / 7)

శనివారం(మార్చి 15) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. 
 

తెలంగాణలోని ఆదిలాబాద్‌లో గురువారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. సాధారణం కన్నా ఏకంగా 4.4 డిగ్రీలు పెరిగి.. 40.3 డిగ్రీలుగా నమోదయింది. బుధవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా సాధారణం కన్నా 2 డిగ్రీలు పెరిగి 22.7 డిగ్రీలుగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లో పగటిపూట సాధారణం కన్నా 3.2 డిగ్రీలు పెరిగి 40.1 డిగ్రీలు రికార్డు అయింది. ఈ నేపథ్యంలో… శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.

(5 / 7)

తెలంగాణలోని ఆదిలాబాద్‌లో గురువారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. సాధారణం కన్నా ఏకంగా 4.4 డిగ్రీలు పెరిగి.. 40.3 డిగ్రీలుగా నమోదయింది. బుధవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా సాధారణం కన్నా 2 డిగ్రీలు పెరిగి 22.7 డిగ్రీలుగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లో పగటిపూట సాధారణం కన్నా 3.2 డిగ్రీలు పెరిగి 40.1 డిగ్రీలు రికార్డు అయింది. ఈ నేపథ్యంలో… శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.

(image source unsplash.com)

ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.  

(6 / 7)

ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు పాత రికార్డులు తిరగరాసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు.  

(Image Source Pixabay )

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో… ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లకపోవటం మంచిదని సూచిస్తున్నారు. డీహ్రైడేషన్ కు గురికాకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

(7 / 7)

ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో… ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం వేళ బయటికి వెళ్లకపోవటం మంచిదని సూచిస్తున్నారు. డీహ్రైడేషన్ కు గురికాకుండా చూసుకోవాలని చెబుతున్నారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు