
(1 / 5)
ఐపీఎల్ మెగా వేలం గత నెలలో జరగగా.. ఇప్పుడు మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం జరగనుంది. 2025 సీజన్ కోసం డబ్ల్యూపీఎల్ వేలం ఈ నెల డిసెంబర్ 15వ తేదీన బెంగళూరులో సాగనుంది.

(2 / 5)
ఈసారి డబ్ల్యూపీఎల్ వేలంలో 120 మంది ప్లేయర్ల పేర్లు ఉన్నాయి. వీరిలో 91 మంది భారత ప్లేయర్లు, 29 మంది విదేశీయులు ఉన్నారు. వీరిలో ముగ్గురు అసోసియేట్ నేషన్స్ ప్లేయర్లు కూడా ఉన్నారు,

(3 / 5)
120 ప్లేయర్లు ఈ మినీ వేలంలో ఉండగా.. 19 మాత్రమే ఖాళీలు ఉన్నాయి. అంటే గరిష్ఠంగా ఈ మినీ వేలంలో 19 మంది ప్లేయర్లే అమ్ముడుకానున్నారు.

(4 / 5)
డబ్ల్యూపీఎల్ మినీ వేలం కోసం గుజరాత్ జెయింట్స్ పర్సులో రూ.4.4 కోట్లు ఉన్నాయి. యూపీ వారియర్స్ వద్ద రూ.3.9 కోట్లు మిగిలి ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్సులో రూ.3.25 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ.2.65కోట్లు, అత్యల్పంగా ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద రూ.2.5కోట్లు ఉన్నాయి.

(5 / 5)
ఈ డబ్ల్యూపీఎల్ వేలంలో భారత స్టార్ స్నేహ్ రాణా, వెస్టిండీస్ ప్లేయర్ దియేంద్ర డొటిన్, ఇంగ్లండ్ స్టార్ హీతర్ నైట్, సౌతాఫ్రికా ప్లేయర్ లిజెలే లీపై ఎక్కువ దృష్టి ఉంది. వీరి కోసం ఫ్రాంచైజీలు ఎక్కువ పోటీ పడొచ్చని అంచనాలు ఉన్నాయి. డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 గంటలకు వేలం మొదలుకానుంది.
ఇతర గ్యాలరీలు