Telugu Cricketers In IPL 2025: ఐపీఎల్ లో తెలుగు క్రికెటర్లు..దమ్ము చూపించేందుకు వస్తున్నారు.. లిస్ట్ లో స్టార్ ప్లేయర్లు-who are the telugu cricketers to play in the ipl 2025 telangana andhra players siraj tilak nitish ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Telugu Cricketers In Ipl 2025: ఐపీఎల్ లో తెలుగు క్రికెటర్లు..దమ్ము చూపించేందుకు వస్తున్నారు.. లిస్ట్ లో స్టార్ ప్లేయర్లు

Telugu Cricketers In IPL 2025: ఐపీఎల్ లో తెలుగు క్రికెటర్లు..దమ్ము చూపించేందుకు వస్తున్నారు.. లిస్ట్ లో స్టార్ ప్లేయర్లు

Published Mar 21, 2025 01:37 PM IST Chandu Shanigarapu
Published Mar 21, 2025 01:37 PM IST

  • Telugu Cricketers In IPL 2025: ఐపీఎల్ 2025 సీజన్ రేపే (మార్చి 22) స్టార్ట్ కానుంది. టైటిల్ కోసం 10 జట్ల పోరు ఫ్యాన్స్ కు కిక్ ఇవ్వనుంది. మరి ఈ ప్రతిష్ఠాత్మక లీగ్ లో ఆడే తెలుగు రాష్ట్రాల ప్లేయర్స్ ఎవరో మీకు తెలుసా? ఈ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

ఒక్క సీజన్ తోనే వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి లైఫ్ టర్న్ అయింది. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఈ కుర్రాడు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 303 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. నితీశ్ ను రూ.6 కోట్లకు హైదరాబాద్ రిటైన్ చేసుకుంది.

(1 / 5)

ఒక్క సీజన్ తోనే వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి లైఫ్ టర్న్ అయింది. ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఈ కుర్రాడు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. 303 పరుగులు చేయడంతో పాటు 3 వికెట్లు పడగొట్టాడు. నితీశ్ ను రూ.6 కోట్లకు హైదరాబాద్ రిటైన్ చేసుకుంది.

(x/SunRisers)

సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొమ్మిదో సారి ఐపీఎల్ లో ఆడబోతున్నాడు. 2017లో సన్ రైజర్స్ కు ఆడిన సిరాజ్.. 2018 నుంచి 2024 వరకు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్ కు ముందు వేలంలో గుజరాత్ టైటాన్స్ అతణ్ని రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. 93 మ్యాచ్ ల్లో సిరాజ్ 93 వికెట్లు పడగొట్టాడు.

(2 / 5)

సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్ తొమ్మిదో సారి ఐపీఎల్ లో ఆడబోతున్నాడు. 2017లో సన్ రైజర్స్ కు ఆడిన సిరాజ్.. 2018 నుంచి 2024 వరకు ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్ కు ముందు వేలంలో గుజరాత్ టైటాన్స్ అతణ్ని రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది. 93 మ్యాచ్ ల్లో సిరాజ్ 93 వికెట్లు పడగొట్టాడు.

(x/mdsirajofficial)

హైదరాబాదీ స్టైలిష్ బ్యాటర్ తిలక్ వర్మ ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు కీ ప్లేయర్ గా మారాడు. ఈ సీజన్ కోసం అతణ్ని ముంబయి రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది. 38 ఐపీఎల్ మ్యాచ్ ల్లో తిలక్ 1156 పరుగులు చేశాడు.

(3 / 5)

హైదరాబాదీ స్టైలిష్ బ్యాటర్ తిలక్ వర్మ ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు కీ ప్లేయర్ గా మారాడు. ఈ సీజన్ కోసం అతణ్ని ముంబయి రూ.8 కోట్లకు రిటైన్ చేసుకుంది. 38 ఐపీఎల్ మ్యాచ్ ల్లో తిలక్ 1156 పరుగులు చేశాడు.

(x/mipaltan)

గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లాడు. వేలంలో అతణ్ని రూ.30 లక్షలకు టీమ్ తీసుకుంది. గత సీజన్ లోనూ సీఎస్కేతో ఉన్న రషీద్ కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అండర్-19 వరల్డ్ కప్ లో సత్తాచాటిన రషీద్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆంధ్ర తరపున 33 ఇన్నింగ్స్ ల్లో 1204 పరుగులు చేశాడు.

(4 / 5)

గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వెళ్లాడు. వేలంలో అతణ్ని రూ.30 లక్షలకు టీమ్ తీసుకుంది. గత సీజన్ లోనూ సీఎస్కేతో ఉన్న రషీద్ కు మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. అండర్-19 వరల్డ్ కప్ లో సత్తాచాటిన రషీద్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆంధ్ర తరపున 33 ఇన్నింగ్స్ ల్లో 1204 పరుగులు చేశాడు.

(x/skrasheed66)

ఆంధ్ర స్పిన్నర్ త్రిపురణ విజయ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విజయ్ 9 మ్యాచ్ ల్లో 28 వికెట్లు పడగొట్టాడు. ఆంధ్ర కుర్రాళ్లు పైలా అవినాష్ (రూ.30 లక్షలకు పంజాబ్ కింగ్స్), సత్యనారాయణ రాజు (రూ.30 లక్షలకు ముంబయి ఇండియన్స్) కూడా ఐపీఎల్ లో పాల్గొంటున్నారు.

(5 / 5)

ఆంధ్ర స్పిన్నర్ త్రిపురణ విజయ్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.30 లక్షలకు దక్కించుకుంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విజయ్ 9 మ్యాచ్ ల్లో 28 వికెట్లు పడగొట్టాడు. ఆంధ్ర కుర్రాళ్లు పైలా అవినాష్ (రూ.30 లక్షలకు పంజాబ్ కింగ్స్), సత్యనారాయణ రాజు (రూ.30 లక్షలకు ముంబయి ఇండియన్స్) కూడా ఐపీఎల్ లో పాల్గొంటున్నారు.

(x/DelhiCapitals)

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు