తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి...? ఐఎండీ అంచనాలేంటి..? తాజా వివరాలివే-when does the southwest monsoon enter in telangana imd weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి...? ఐఎండీ అంచనాలేంటి..? తాజా వివరాలివే

తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయి...? ఐఎండీ అంచనాలేంటి..? తాజా వివరాలివే

Published May 13, 2025 06:43 AM IST Maheshwaram Mahendra Chary
Published May 13, 2025 06:43 AM IST

ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశిస్తున్నాయి. ఐఎండీ అంచనాల ప్రకారం… ఇవాళ(మే 13 ) దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలను తాకే అవకాశం ఉంది. ఇక మే 27న కేరళను తాకే అవకాశం ఉంది. జూన్ మొదటి వారంలోపు తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి. ఇవాళ(మే 13) దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.

(1 / 8)

ఈసారి ముందుగానే నైరుతి రుతుపవనాలు రాబోతున్నాయి. ఇవాళ(మే 13) దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది.

(HT Telugu)

అండమాన్ సముద్రమే కాకుండా దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ ద్వారా పేర్కొంది.

(2 / 8)

అండమాన్ సముద్రమే కాకుండా దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ విడుదల చేసిన బులెటిన్ ద్వారా పేర్కొంది.

(istockphoto.com)

దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు నికోబార్ దీవులు,అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ వివరించింది. ఇవి మరింతగా ముందుకు సాగేందుకు తదుపరి 4- 5 రోజులు వాతావరణం మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.

(3 / 8)

దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు నికోబార్ దీవులు,అండమాన్ సముద్రం, మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ వివరించింది. ఇవి మరింతగా ముందుకు సాగేందుకు తదుపరి 4- 5 రోజులు వాతావరణం మరింత అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని అంచనా వేసింది.

ఇవాళ దక్షిణ అండమాన్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో…ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. కేరళను తాకిన తర్వాత… క్రమంగా దేశవ్యాప్తంగానూ రుతుపవనాలు విస్తరిస్తాయి.

(4 / 8)

ఇవాళ దక్షిణ అండమాన్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్న నేపథ్యంలో…ఈ నెల 27 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. కేరళను తాకిన తర్వాత… క్రమంగా దేశవ్యాప్తంగానూ రుతుపవనాలు విస్తరిస్తాయి.

(Unsplash)

ఇక తెలంగాణలోకి కూడా రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. జూన్ మొదటివారంలోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు రావొచ్చని భావిస్తోంది. వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటే జూన్ 5వ తేదీ నాటికే రాష్ట్ర సరిహద్దులను తాకే అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది.

(5 / 8)

ఇక తెలంగాణలోకి కూడా రుతుపవనాలు ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. జూన్ మొదటివారంలోపు రాష్ట్రంలోకి రుతుపవనాలు రావొచ్చని భావిస్తోంది. వాతావరణ పరిస్థితులు మరింత అనుకూలంగా ఉంటే జూన్ 5వ తేదీ నాటికే రాష్ట్ర సరిహద్దులను తాకే అవకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేస్తోంది.

(Pexels)

సాధారణంగా జూన్‌  మొదటి వారం నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశమంతటా విస్తరించి… వర్షాలు కురుస్తుంటాయి. అయితే ఈసారి మాత్రం ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయి. గత ఏడాది మే 31న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేయగా... మే 30న తీరాన్ని తాకాయి.

(6 / 8)

సాధారణంగా జూన్‌ మొదటి వారం నాటికి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశమంతటా విస్తరించి… వర్షాలు కురుస్తుంటాయి. అయితే ఈసారి మాత్రం ముందుగానే నైరుతి రుతుపవనాలు రానున్నాయి. గత ఏడాది మే 31న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేయగా... మే 30న తీరాన్ని తాకాయి.

(Unsplash)

ఇక ఈ ఏడాది రుతుపవన కాలంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కొద్దిరోజుల కిందటే వెల్లడించింది. ఐఎండీ అంచనాల మేరకు… విస్తారంగా వర్షాలు కురిస్తే…. వ్యవసాయానికి ఢోకా ఉండదు.

(7 / 8)

ఇక ఈ ఏడాది రుతుపవన కాలంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ కొద్దిరోజుల కిందటే వెల్లడించింది. ఐఎండీ అంచనాల మేరకు… విస్తారంగా వర్షాలు కురిస్తే…. వ్యవసాయానికి ఢోకా ఉండదు.

(Unsplash)

మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రాన్ని అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 14వ తేదీన (బుధవారం) ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(8 / 8)

మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రాన్ని అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 14వ తేదీన (బుధవారం) ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెండు మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు