(1 / 6)
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. అంచనా వేసిన సమయానికంటే ముందుగానే కేరళను తాకే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఈనెల 24న కేరళలోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశం ఉంది.
(unsplash)(2 / 6)
ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే.. తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు త్వరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మే నెల 27వ తేదీకి ఒకరోజు అటుఇటుగా.. తెలంగాణను రుతుపవనాలు తాకనున్నాయి. ఆ తర్వాత వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. వీటి ప్రభావంతో దక్షిణ, ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(unsplash)(3 / 6)
జూన్ మొదటి లేదా రెండో వారంలో.. తెలంగాణపై రుతుపవనాల ప్రభావం కాస్త తగ్గుతుంది. వర్షాలు తగ్గుతాయి. అయితే.. అప్పటికే వర్షాలు కురిసిన కారణంగా.. ఎండలు, వేడి తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని.. వాతావరణ విభాగం నిపుణులు చెబుతున్నారు. వాతావరణం ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
(unsplash)(4 / 6)
మామూలుగా అయితే.. నైరుతి రుతుపవనాలు జూన్ 1 నుంచి వారం రోజుల వ్యవధిలో కేరళను తాకుతాయి. ఆ తర్వాత వారం, పది రోజుల్లో రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాకు విస్తరిస్తాయి. జూన్ మూడో వారం నుంచి ఏపీ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ ఏడాది నాలుగు రోజులు ముందే రుతుపవనాలు ఏపీకి రానున్నాయి. జూన్ రెండో వారం నుంచే వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది.
(unsplash)(5 / 6)
ఈసారి నైరుతి రుతుపవనాల సీజన్లో.. సాధారణం కంటే ఎక్కువ.. అంటే 104 శాతం వర్షాపాతం నమోదవుతుందని అంచనా. దీనికి సంబంధించి గత నెలలోనే వాతావరణ శాఖ ప్రకటించింది. దీంతో రైతులు భరోసాగా ఉన్నారు. ఈసారి అన్నదాతలకు అనుకూలంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.
(unsplash)(6 / 6)
గత 20 ఏళ్లలో 2015లో మినహా.. 2005-2024 మధ్య కేరళకు నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంబంధించి ఐఎండీ అంచనాలు ఎప్పుడూ తప్పలేదు. తాజా అంచనా ప్రకారం.. నైరుతి రుతుపవనాలు పురోగమిస్తున్నందున.. ఎండలు, వడగాడ్పుల నుంచి ప్రజలకు త్వరలో ఉపశమనం లభించనుంది.
(unsplash)ఇతర గ్యాలరీలు